TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని దారుణం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు అత్యాచారం చేశారు. చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి, నిందితులను పోలీసులకు అప్పగించారు.
SDPT: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి ఐదు వేలు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో జరిగింది. నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిస అయి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవకు దిగిన అనంతరం కోపంతో తను మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: సికింద్రాబాద్లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్పై నుంచి దూకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.హైవే సేఫ్టీ సిబ్బంది సహాయంతో క్షతగాత్రుడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని కుసుమావలస గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కించుమండల వైపు నుంచి అరకు వారపు సంతకు కూరగాయలు తీసుకువెళుతున్న ఓ ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాయని పేర్కొన్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్ర కాలనీలో ఓ చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందింది. ప్రభాకర్, రజిని దంపతులు ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంకాలం వారి కూతురు చిన్నారి గీష్మ నీటి ఆడుకుంటూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
E.G: గోకవరం మండలం బావాజీపేట గ్రామానికి చెందిన దుల్ల చరణ్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
VSP: బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
GNTR: తెనాలిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. మారిస్పేట-మద్రాసు గేటు మధ్య రైలు పట్టాలు దాటుతున్న సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని మిలటరీ స్పెషల్ ట్రైన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావును దుండగులు హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయన్ను గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
‘నన్ను తల్లిని చేసే పురుషుడికి.. రూ.25 లక్షలు ఇస్తా’ అనే ఓ వీడియోను సోషల్ మీడియాలో చూసి 44 ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. ఓ మహిళ సీరియస్ వాయిస్తో తనకు పురుషుడు కావాలని.. తాను తల్లి అయితే చాలంటూ ఉన్న వీడియోను పుణెకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ చూశాడు. ఇది నిజమేనని నమ్మి.. అందులో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేశాడు. అంతే.. సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.11లక్షలు దోచేశారు.
గుంటూరులో ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కొత్తపేట PS పరిధిలోని గెస్ట్ రూమ్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నందివెలుగు రోడ్డులో అక్రమంగా సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న నంది మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ATP: గుత్తి పట్టణ శివారులోని తాడిపత్రి రోడ్డులో గురువారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.