• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

విషం తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: విషం తాగి భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్రంకొండ ఎస్సై మధురామ చంద్రుడు తెలిపారు. తరిగొండ గ్రామం బొడ్డువారిపల్లెకు చెందిన నూరుఖాన్(35) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ సమస్యలు కారణంగా శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 29, 2024 / 09:30 AM IST

BREAKING: ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య

TG: మెదక్ జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీస్ HQ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్నిగమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిద్ధిపేటలో కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

December 29, 2024 / 09:14 AM IST

విమాన ప్రమాదం.. 62కు చేరిన మృతుల సంఖ్య

దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 62కు చేరింది. విమానం బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని రన్‌వేపై విమానం అదుపు తప్పి గోడను బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

December 29, 2024 / 09:13 AM IST

ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

ELR: ఉంగుటూరు గ్రామంలో రావిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. వెంటనే ఇంట్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఇంట్లో వాళ్లు సురక్షితంగా తప్పించుకున్నారు. పెంకుటిల్లు స్వల్పంగా దగ్ధమైంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

December 29, 2024 / 08:19 AM IST

రన్‌వేపై అదుపుతప్పి గోడను ఢీకొట్టిన విమానం

ఎయిర్‌పోర్ట్‌లో విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టిన ఘటన దక్షిణకొరియాలో చోటుచేసుకుంది. ముయాన్ విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పి గోడను విమానం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికైనా గాయాలయ్యాయా, ప్రాణాపాయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

December 29, 2024 / 06:56 AM IST

రైల్వేట్రాక్ వద్ద మృతదేహం కలకలం

VZM: విజయనగరం జిల్లా కోరుకొండ-జొన్నవలస మధ్యలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ ఎస్ఐ వి. బాలాజీరావు శనివారం తెలిపారు. మృతుని వయసు సుమారు 55-60 మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు విజయనగరం జీఆర్పీ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

December 29, 2024 / 06:10 AM IST

ఆగివున్న గ్రానైట్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

BPT: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో గ్రానైట్ లారీ మరమ్మతులకు గురికావడంతో రోడ్డుపై నిలిపారు. అదే దారిలో బైక్‌పై వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 29, 2024 / 05:27 AM IST

కారిపాకంలో ఆరుగురు అరెస్ట్.. గంజాయి స్వాధీనం

TPT: వరదయ్యపాలెం మండలం కారిపాకంలో గంజాయి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మల్లికార్జున్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా సమాచారంతో దాడి చేసి రూ.72 వేలు విలువైన 6 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు విఘ్నేష్, అరసు, అజిత్ కుమార్, నరేంద్ర, సురేశ్, రాజాను రిమాండ్‌కు తరలించామన్నారు.

December 29, 2024 / 04:51 AM IST

దారుణం: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని హత్య

ELR: టి.నర్సాపురం మండలం వెలగపాడు శివారులో శనివారం రాత్రి దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో భార్య శ్రావణి (23)ను భర్త రాము హత్య చేశాడు. తలపై కర్రతో దాడి చేయడంతో ఆమె ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ చెన్నారావు దర్యాప్తు చేస్తున్నారు.

December 29, 2024 / 04:12 AM IST

ఆటో బోల్తా పడి 8మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

కడప: ఆదర్శ స్కూల్ పిల్లలను ఇంటికి తరలిస్తున్న ఆటో పరసతోపు వద్ద బోల్తా పడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గుండ్లపల్లికి చెందిన విద్యార్థులు ఆదర్శ స్కూల్లో చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళుతుండగా, పరసతోపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డవారిని మదనపల్లెకి తరలించారు.

December 29, 2024 / 04:09 AM IST

విద్యుత్ షాక్‌కు గురై విద్యార్థి మృతి

NLG: గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే 10వ తరగతి విద్యార్థి శనివారం ఇంటి పైన ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.

December 28, 2024 / 08:25 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కోనసీమ: ఆత్రేయపురం లొల్ల నుండి ఆత్రేయపురం వైపు వెళ్లే రహదారిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత్రగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 28, 2024 / 07:35 PM IST

ప్రమాదవశాత్తు జారిపడి బేల్దారి మృతి

ATP: తాడిపత్రి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణములో నివాసముండే కంబగిరి అనే భవన నిర్మాణ కార్మికుడు శనివారం ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కంబగిరి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

December 28, 2024 / 06:27 PM IST

కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

KMR: కడుపు నొప్పి భరించలేక మహిళ పురుగుల మందు సేవించి ఈనెల 12న ఆత్మహత్యాయత్నం చేస్తుందని ఎస్ఐ రంజిత్ తెలిపారు. సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన కోరబోయిన రాజమణి(57) మహిళ పురుగుల మందు సేవించగా ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.

December 28, 2024 / 06:06 PM IST

FLASH: టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడు మృతి

AP: కడప టీడీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఎమ్మెల్సీ కుమారుడు విష్ణుస్వరూప్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 28, 2024 / 05:53 PM IST