• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ASR: డుంబ్రిగూడ మండలంలోని కుసుమావలస గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కించుమండల వైపు నుంచి అరకు వారపు సంతకు కూరగాయలు తీసుకువెళుతున్న ఓ ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాయని పేర్కొన్నారు.

October 31, 2025 / 10:03 AM IST

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

ATP: బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్ర కాలనీలో ఓ చిన్నారి నీటి బకెట్‌లో పడి మృతి చెందింది. ప్రభాకర్, రజిని దంపతులు ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంకాలం వారి కూతురు చిన్నారి గీష్మ నీటి ఆడుకుంటూ నీటి బకెట్‌లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

October 31, 2025 / 09:40 AM IST

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతదేహం లభ్యం

E.G: గోకవరం మండలం బావాజీపేట గ్రామానికి చెందిన దుల్ల చరణ్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

October 31, 2025 / 09:20 AM IST

బెట్టింగ్ యాప్.. ఇద్దరు అరెస్ట్

VSP: బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌లు నడుపుతున్నారని సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

October 31, 2025 / 08:15 AM IST

తెనాలిలో రైలు ఢీకొని యువకుడి మృతి

GNTR: తెనాలిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. మారిస్‌పేట-మద్రాసు గేటు మధ్య రైలు పట్టాలు దాటుతున్న సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని మిలటరీ స్పెషల్‌ ట్రైన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2025 / 08:02 AM IST

BREAKING: ఖమ్మం జిల్లాలో దారుణం

TG: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావును దుండగులు హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ను గొంతుకోసి చంపేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

October 31, 2025 / 07:55 AM IST

‘గర్భవతిని చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా!’

‘నన్ను తల్లిని చేసే పురుషుడికి.. రూ.25 లక్షలు ఇస్తా’ అనే ఓ వీడియోను సోషల్ మీడియాలో చూసి 44 ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. ఓ మహిళ సీరియస్ వాయిస్‌తో తనకు పురుషుడు కావాలని.. తాను తల్లి అయితే చాలంటూ ఉన్న వీడియోను పుణెకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ చూశాడు. ఇది నిజమేనని నమ్మి.. అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే.. సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.11లక్షలు దోచేశారు.

October 31, 2025 / 07:25 AM IST

టాస్క్ ఫోర్స్ దాడుల్లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

గుంటూరులో ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కొత్తపేట PS పరిధిలోని గెస్ట్ రూమ్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నందివెలుగు రోడ్డులో అక్రమంగా సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న నంది మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

October 31, 2025 / 05:59 AM IST

రెండు లారీలు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

ATP: గుత్తి పట్టణ శివారులోని తాడిపత్రి రోడ్డులో గురువారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

October 31, 2025 / 05:55 AM IST

BREAKNG: ప్రమాదం.. ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

October 31, 2025 / 05:50 AM IST

BREAKING: పెళ్లికి వెళ్లి వస్తుండగా ముగ్గురు మృతి

TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

October 31, 2025 / 05:50 AM IST

ఎవరెస్ట్ వద్ద కూలిన రెస్క్యూ హెలికాప్టర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ వైపున మంచులో చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించే క్రమంలో ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మంచు కారణంగా జారిపడి లోబుచే వద్ద కూలిపోయింది. ట్రెక్కర్ల రెస్క్యూ మిషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

October 30, 2025 / 09:41 PM IST

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వృద్ధుడికి రూ. 51 లక్షల టోకరా

TG: HYDలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 76 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు రూ.51 లక్షలు టోకరా వేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఆ బాధితుడిని, బాంబు పేలుళ్లు/కిడ్నాప్ కేసుల్లో సిమ్ వాడారని వాట్సాప్ కాల్ చేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వీడియో కాల్‌లో 24 గంటలు నిర్బంధించి డబ్బు కాజేశారు. మనీలాండరింగ్‌లో భాగస్వామ్యం ఉందని బెదిరించి మోసం చేశారు.

October 30, 2025 / 09:36 PM IST

వృద్ధుడికి రూ.51 లక్షలు టోకరా!

TG: డిజిటల్ అరెస్టు పేరుతో HYDలోని ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో మీ సిమ్ వాడారంటూ బాధితుడు (78)కి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ పేరుతో వాట్సాప్ కాల్ చేశారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దీంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

October 30, 2025 / 09:21 PM IST

వరదలో కొట్టుకుపోయిన దంపతులు.. మహిళ మృతి

RR: మొంథా తుఫాన్ కారణంగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. తుఫాన్ కారణంగా బాటసింగారం పెద్దవాగు ఉధృత రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు భర్తను రక్షించగా మహిళ మృతి చెందింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 30, 2025 / 07:48 PM IST