TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.