ATP: కళ్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుచ్చకాయల లోడుతో వెళ్తున్న బొలెరో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. టైర్ పగిలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.