SKLM: లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఓ రైస్ మిల్లు సమీపంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న జూదం శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు దాడి చేసినట్లు ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.8,300 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.