కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ పంచాయితీ వీధివారి లంకకు చెందిన పల్లిచిట్టయ్య (65) తాతపూడి లంకకు వెళ్లాడు. అయితే తిరిగి రాకపోవడంతో లంకలోకి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సహాయంతో గోదావరిలో గాలిస్తున్నారు.