అన్నమయ్య: మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టి పారిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.