ATP: గుత్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్లో మట్కా స్థావరంపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. మట్కా రాస్తున్నారని తమకు రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అందులో భాగంగా ఇద్దరు మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 62,000 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.