కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జమ్మలమడుగు పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీల్లో కొందరు బహిరంగంగా మద్యం తాగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అర్బన్ సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.
KRNL: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
KRNL: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
విశాఖ: జీవీఎంసీ 63వ వార్డు, క్రాంతి నగర్ గ్రామంలో చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన పార్కు చుట్టుపక్కల భవన నిర్మాణ వ్యర్ధాలు వేయడం వలన పార్కులో క్రీడలు ఆడుకునే వారికి గాయాలు అవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు చుట్టుపక్కల రక్షణ గోడ లేకపోవడం వలన పార్కు కబ్జాకు గురవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ATP: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీము 2026-27 సంవత్సరానికి పొడిగిస్తూ జీవో MS 43 విడుదలైనట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జర్నలిస్టులు www.cfms.ap.gov.in.1,250 చెల్లిస్తే.. ప్రభుత్వం సమానంగా మరో రూ.1,250 భరిస్తుందన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనం పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన వారు అవసరమైన పత్రాలను సమర్పించాలన్నారు.
E.G: ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పల్నాడు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తనపల్లి మండలం తొండపిలో భార్యాభర్తల మధ్య వివాదం కలకలం రేపింది. భార్య భూలక్ష్మిపై అనుమానం పెంచుకున్న భర్త లక్ష్మయ్య అమానుషానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె కాలును నరికేశాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని గురువారం రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దర్శనం అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
GNTR: టీడీపీ ప్రకటించిన విస్తృత స్థాయి పదవుల్లో గుంటూరు తూర్పు నేతలకు చోటు దక్కకపోవడం అసంతృప్తిని పెంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత విజయం సాధించినా ప్రాతినిధ్యం లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, మైనారిటీ నాయకులను విస్మరించారనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే, దీనిపై పార్టీ ఎలా స్పందిస్తో చూడాలి మరీ.
PPM: చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి వ్యవసాయం బృందం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల చక్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల ప్రాంగణాల్లో చిరుధాన్యాలు సాగును చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో విషు వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ డాక్టర్ జి. శంకర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన సుశీల బృందం ‘సప్త వీణ’ వాయిద్య కచేరీతో అలరించారు. సాయి గాయత్రితో మొదలైన కచేరీలో మహా గణపతిం, హరివరాసనం వంటి కీర్తనలను ఏడు వీణల సమన్వయంతో అద్భుతంగా పలికించారు. ఈ ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది.
ATP: స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా లోపాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాలో 188 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: కె.గంగవరం మండలం కోట గ్రామం ఏటి గట్టుపై ఉన్న సూయిజ్ వంతెన శిథిలావస్థకు చేరిందని స్థానికులు అంటున్నారు. గతంలో ప్రమాదాలు నివారణకు యువత ఇక్కడ ఇనుప మెస్ ఏర్పాటు చేసిన వాహనాలు ధాటికి అది దెబ్బతిని పరిస్థితి మళ్లీ మొదటి వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
AKP: ఎస్ రాయవరం మండలంలో 28 గ్రామపంచాయతీలో 62,032 మంది ఓటర్లు ఉన్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. వీరిలో పురుషులు 29,944 మంది, మహిళలు 32,086 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఓటరు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు ఓ సారి ఓటరు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలన్నారు.
W.G: ఇలపర్రు సొసైటీ వద్ద రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించుకోవచ్చని సూచించారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.