అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు. ఈ కేసులో మరో సీఐ, కొంతమంది కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం జనగణనపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకుంటూ, జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, పురపాలక సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
E.G: ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 4.8 కిలోల గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తెలిపారు. సీతంపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న నిడదవోలుకు చెందిన శృతి వెంకట సాయి సతీష్, భాను ప్రకాష్, సంతోష్, మద్దూరుకు చెందిన మిస్ కుమార్, సంతోష్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు.
KDP: కమలాపురంలో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ముందస్తుగా ఇంధనం నింపించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరడంతో బంకుల వద్ద పొడవైన క్యూలు ఏర్పడి, కొంతమంది గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రద్దీ కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ అన్ని బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులకు వచ్చిన వాహనదారులు వెనుదిరిపోతున్నారు. దీంతో ఆటో వాలాలు, వ్యవసాయంపై ఆధారపడిన టాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి డీజల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సత్యసాయి: రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ గాజుల ఆదెన్న ఆదివారం ఉదయం 11.00 గంటలకు లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ దర్శనం అనంతరం అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆయన పర్యటన సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేపట్టారు.
E.G: తాళ్ళపూడి మండల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తాళ్ళపూడి ఎస్సై టి.రామకృష్ణ హెచ్చరించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిఘా వేయడానికి వీలుపడని గోదావరి చుట్టు పక్క ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించేందుకు డ్రోన్ ఉపయోగించారు.
SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం స్వామి వారి ప్రసాదం అమ్మకాల్లో ఇష్ట రాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ తరపున ప్రసాదం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రసాదం వద్ద బోర్డు పది రూపాయలు అని ప్రకటన చేశారు. టికెట్ ఇవ్వకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
KKD: పెద్దాపురం మండలంలోని పెట్రోల్ బంక్లో తహశీల్దార్ వెంకటలక్ష్మి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తహశీల్దార్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, పులిమేరు, వడ్లమూరు పెట్రోల్ బంకులను తహశీల్దార్ పరిశీలించారు.
W.G: మొగల్తూరుకు చెందిన అలపాటి రాజేశ్ (31) ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ, శనివారం బ్రెయిన్ డెడ్ అవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ రాజేశ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తద్వారా మరికొందరికి ప్రాణభిక్ష పెట్టి రాజేశ్ ఆదర్శంగా నిలిచారు.
SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మే 9న పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. జలుమూరు మండలం అక్కు రాడ గ్రామంలో నిర్వహించనున్న “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
KRNL: ఆస్తి పన్ను రాయితీతో చెల్లించేందుకు మరో నాలుగు రోజుల మాత్రమే గడువు మిగిలి ఉందని శనివారం కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి పన్నుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మన్యం: గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన నాగావళి కాలువ వంతెన ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ వంతెన మీదుగా సాంబన్నవలస, మరుపెంట, సీమలవానివలస గ్రామాల ప్రజలు, రైతులు పంట పొలాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన శిథిలావస్థ కారణంగా ఎప్పుడైనా కూలిపోతుందేమోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చేపట్టిన “మన గ్రామానికి మన శైలజానాథ్” కార్యక్రమం నేడు ఏడవులపర్తిలో జరగనుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ క్యాంపు కార్యాలయం కోరింది.
విశాఖ: ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సుమారు 68 ఏళ్ల వయసున్న మహిళ సముద్రంలో మునిగిపోతుండగా గుర్తించిన లైఫ్ గాడ్స్ ధనరాజ్, ఆనంద్ వెంటనే ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.