VZM: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పట్టణంలోని మహిళా పోలీసు స్టేషనులో మనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్ రామ్ ముఖ్యపాత్ర పోషించారన్నారు.
TPT: తిరుపతి యూత్ హాస్టల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంచుకోవాలని, పోటీ ప్రపంచంలో అవగాహన ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. ఎక్స్పోలో వివిధ విద్యా కోర్సులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
KNR: కోడుమూరు నుంచి రాజోలికి గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా సేవలు లేకపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని వారు తెలిపారు. బస్సు పునరుద్ధరణ కోసం పలుమార్లు అధికారులను కోరినా స్పందన లభించలేదని వాపోయారు. వెంటనే బస్సు సేవలు పునఃప్రారంభించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
VSP: సింహాచలం కొత్త గోసాల కృష్ణాపురంలో నిర్వహించిన ‘శబల-2026 సుస్థిర జీవన ఉత్సవం’లో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులకు బహుమతులు అందజేసి, వివిధ స్టాల్స్ పరిశీలించారు. సాంప్రదాయ ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
SKLM: పలాస కిడ్నీ మార్పిడి బాధితురాలు హేమశ్రీని ఎమ్మెల్యే గౌతు శిరిష ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న హేమశ్రీ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తీరును వైద్యులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
KDP: చిన్నచౌకు పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానితుల సమాచారాన్ని 112కు ఇవ్వాలని సూచించారు.
AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసిక్షణ మహా అభియాన్ ప్రారంభమైంది. మండల అధ్యక్షులు కుమారస్వామి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతం ఆలపించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ నాయుడు బీజేపీ చరిత్ర, సంస్కరణలను వివరించారు.
PPM: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చేపట్టిన “మీ ఇంటికి-మీ డాక్టర్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా మారుమూల గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నారు. కొమరాడ మండలంలో ఇప్పటికే 8 గ్రామాల్లో 500 మందికి పైగా సేవలు అందించారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఈ సేవలు విస్తరించనున్నాయి.
అన్నమయ్య: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు.
ATP: కూడేరు మండలం ముద్దలపురం వద్ద 16 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో MP అంబికా లక్ష్మీనారాయణ, MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
BPT: బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. వేమూరు మండలం జంపని, వేమూరు గ్రామాలతో పాటు కొల్లూరు మండలంలోని కొల్లూరు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించారు.
E.G: ద్వారకాతిరుమల మండలం మలసానిగుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.
కృష్ణా: రాష్ట్ర ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులో పట్టణ వ్యాప్తంగా క్రిస్టియన్స్ యునైటెడ్ ఫెలోషిప్ 8 చోట్ల ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఖురాన్లో అల్లాహ్ గాని పరులకు సహాయపడుతూ, పదిమందికి మంచి చేయాలని చెప్పి ఉన్నారని అన్నారు.
NLR: తనపై సోషల్ మీడియా గ్రూపుల్లో అసత్య పోస్టులు వేసి ప్రచారం చేస్తున్నారని నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ పత్రిక బ్యూర్ ఇంఛార్జ్ మస్తాన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. అభ్యంతరకరంగా నిరాధారమైన పోస్టులతో తన ప్రతిష్ఠతకు భంగం కలిగించారని వారిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సత్యసాయి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పుట్టపర్తిలో YCP ఎస్సీ సెల్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించి భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ కరువైందని వారు ఆరోపించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.