NTR: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ATP: అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ‘మిస్సైల్ ఉమెన్’గా పేరొందిన డా.టెస్సీ థామస్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఆమెకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు.
BPT: వేటపాలెం మండలం దేశాయిపేట పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్లు మితిమీరాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బంతికి పందేలు కాస్తూ శ్రామికులు, ఉద్యోగులు కష్టార్జితం పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ మోజులో భర్తలు అప్పుల పాలవుతున్నారని మహిళలు వాపోతున్నారు. లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
NLR: వైసీపీ రాజకీయం చేసి మత్స్యకారులను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. మత్స్యకారులకు మొదటి నుంచి వైసీపీనే ద్రోహం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం చేశారన్నది అవాస్తవమన్నారు. మత్స్యకారులకు అన్యాయం చేయాలన్న ఆలోచన లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైసీపీ ఆరాటపడుతుందని స్పష్టం చేశారు.
KKD: సామర్లకోట మండలం జి.మేడపాడులో మదిన లోవలక్ష్మి హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ఇరుకుటుంబాల మధ్య సరిహద్దు తగాదా వివాదంగా మారి హత్యకు దారి తీసిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: మార్కాపురంలోని కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె కోరారు.
సత్యసాయి: రాష్ట్ర కురుబ సంఘం ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కురుబ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాయదుర్గానికి చెందిన ఎస్.కే. మల్లికార్జునను ఏకగ్రీవంగా నియమించారు. నూతన కార్యవర్గానికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు.
W.G: ‘చలో ఆకివీడు’ కార్యక్రమంలో భాగంగా అనుమతి లేకుండా తరలివచ్చిన 73మందిని అరెస్ట్ చేసినట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పట్టణమంతటా భారీ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం రాత్రి వినాయకుడికి సంకటహర చతుర్థి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. ఈ సంకట చతుర్దశి పూజలు చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం అన్నారు.
VZM: జనవరి 4న, ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి భోగాపురం పర్యటన సందర్భంగా, కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే ,జీ.ఎం.ఆర్. విమానాశ్రయ సిబ్బందితో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి గ్రూపు ఫోటో తీసుకొన్నారు.
ATP: రాయదుర్గం పట్టణంకోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి పవళింపు సేవను నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాల వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితుల రామకృష్ణ మీడియాతో తెలిపారు.బ్రహ్మోత్సవాలకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు
W.G: భీమవరం పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
NDL: శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి నెల్లూరు వాసి హరి ప్రసాద్ కుటుంబం రూ.50,116 విరాళం అందజేశారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి నగదు స్వీకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. విరాళంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులకు నిధులు వినియోగిస్తామన్నారు.
NLR: సంగం మండల కేంద్రంలో ఇవాల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని గాంధీ జన సంఘం వద్ద కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం సంగం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
విశాఖ: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా ఉంటుంది. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.