సత్యసాయి: రాష్ట్ర కురుబ సంఘం ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కురుబ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాయదుర్గానికి చెందిన ఎస్.కే. మల్లికార్జునను ఏకగ్రీవంగా నియమించారు. నూతన కార్యవర్గానికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు.