సత్యసాయి: అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్కు పూలబొక్కే అందజేసి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.