W.G: ‘చలో ఆకివీడు’ కార్యక్రమంలో భాగంగా అనుమతి లేకుండా తరలివచ్చిన 73మందిని అరెస్ట్ చేసినట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పట్టణమంతటా భారీ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.