ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్లో ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తులసి తెలిపారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు అరగంట ముందుగానే పాఠశాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులను చూసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.