ATP: రాయదుర్గం పట్టణంకోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి పవళింపు సేవను నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాల వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితుల రామకృష్ణ మీడియాతో తెలిపారు.బ్రహ్మోత్సవాలకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు