• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మైనర్ బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికపై దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

April 17, 2026 / 07:52 AM IST

‘ఓటరు జాబితాలను పరిశీలించాలి’

AKP: ఓటరు జాబితాలను పరిశీలించి తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేయించాలని పాయకరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు వై. వరహాల బాబు సూచించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివరాం పాల్గొన్నారు.

April 17, 2026 / 07:48 AM IST

13 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

KDP: సిద్దవటం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు SI హారిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో గురువారం దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

April 17, 2026 / 07:42 AM IST

కూటమి పాలనలో రైతుకు కన్నీరే: కాకాణి

NLR: కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో వరిగొండలో పర్యటించిన ఆయన గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

April 17, 2026 / 07:41 AM IST

మహిళా రక్షణే లక్ష్యం: సీఐ తిరుమలరావు

VSP: మహిళలు, విద్యార్థినుల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని సీఐ తిరుమలరావు అన్నారు. కేజీబీవీ పాఠశాలలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘దిశ’ యాప్ అత్యవసర సమయంలో రక్షణగా పనిచేస్తుందని వివరించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఘటనలను 100/112కు తెలియజేయాలని చెప్పారు.

April 17, 2026 / 07:40 AM IST

ఇద్దివానిపాలెం ఓటర్లకు అలర్ట్.. లిస్ట్ వచ్చేసింది!

SKLM: ఇద్దివానిపాలెంలో గురువారం ప్రత్యేక గ్రామసభనిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అధికారి కె. శ్రీనివాసరావు, సెక్రటరీ పంచాయతీ తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో లిస్ట్ను ప్రదర్శించి వివరాలను చూపించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, మార్పుల గురించి చర్చించారు.

April 17, 2026 / 07:36 AM IST

కమీచనర్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే‌కు సెల్ఫ్ ఎన్యూమరేషన్

VZM: రాజాం MLA కొండ్రు మురళీమోహన్ గురువారం స్దానిక TDP కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు ఆద్వర్యంలో జనగణన-2027లో భాగంగా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల స్దితిగతులు, వసతులు, ఇతర కుటుంబ వివరాలను ఎటువంటి భయం లేకుండా అధికారులకు ఖచ్చితంగా తెలియజేయాలని అన్నారు.

April 17, 2026 / 07:31 AM IST

స్డాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్

KKD: డిప్యూటీ సీఎం పవన్, నిహారికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్త వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 62/2026 U/S 356(2), 353(2), 79 BNS, 67 ITA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జోక్స్ పేరుతో ఎవరినైనా కించపరిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

April 17, 2026 / 07:20 AM IST

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

క‌ృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. కానూరుకి చెందిన జగదీష్ HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల నిమిత్తమై ఇంటికి వచ్చి HYD వెళుతుండగా గురువారం ఉదయం వెదురుపావులూరు టోల్ గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

April 17, 2026 / 07:20 AM IST

‘భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు’

SKLM: భార్యను తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జడ్జి కె. కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి M భరణికోటకి చెందిన ఎస్ .పద్మను భర్త జగ్గారావు 2021 లో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు SP తెలిపారు.

April 17, 2026 / 07:18 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులపై లోకేశ్ దృష్టి

గుంటూరు: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు విధానంపై పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

April 17, 2026 / 07:10 AM IST

3,106 చెరువుల్లో ఉపాధి పనులు: కలెక్టర్

CTR: ‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వల పెంపు, సాగునీటి బలోపేతం, కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

April 17, 2026 / 07:09 AM IST

‘సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

AKP: సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నక్కపల్లి ఎంపీడీవో కే.చలపతిరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉపమాక పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

April 17, 2026 / 07:08 AM IST

వీధి శునకాల నియంత్రణకు మున్సిపల్ డ్రైవ్

NLR: కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాలతో వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ బృందం గురువారం సాయంత్రం కపాడిపాలెం, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు 5 వీధి శునకాలను బంధించి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్‌కు తరలించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువుల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

April 17, 2026 / 07:01 AM IST

తమ్ముడిని చంపిన అన్న అరెస్ట్

NLR: నెల్లూరు జిల్లా ప్రగతినగర్‌లో జరిగిన రఫీ హత్య కేసులో అతడి అన్న ఖలీల్, మరో నిందితుడు రాజేశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ గొడవలు, ఫంక్షన్ మ్యూజిక్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారితీసింది. పథకం ప్రకారం రఫీని రోడ్డుపైకి లాక్కొచ్చి కత్తితో పొడిచి చంపిన నిందితులను, రైల్వే స్టేషన్ సమీపంలో దర్గామిట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

April 17, 2026 / 06:58 AM IST