• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

త్వరలో త్రిశూల్ ప్రారంభం

VSP: కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూల్‌ను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పనుల ప్రగతిని పరిశీలించి ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పరిసరాల్లో పచ్చదనం, బెంచీలు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

April 15, 2026 / 04:11 PM IST

‘ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు’

AKP: జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు డీఐఈవో వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ 10,315 మంది విద్యార్థులు హాజరు కాగా 7,602 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,926 విద్యార్థులు పరీక్షలు రాయగా 7,829 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.

April 15, 2026 / 04:11 PM IST

స్కూల్ చెట్ల తొలగింపుపై ఆందోళన

CTR: పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఎగువ వెంకటాపురం ఎంపీపీ స్కూల్‌లో చెట్ల తొలగింపుపై గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోను సంప్రదించి చెట్లను తొలగించవద్దని కోరారు. ఎంఈవో, తహసీల్దార్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 15, 2026 / 03:54 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి

ATP: పేదల ఆకలి తీర్చేది మన సీఎం చంద్రబాబు నాయుడని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్‌కి వచ్చిన ప్రజలతో కలిసి మంత్రి కేశవ్ భోజనం చేశారు. ప్రతి పేదవాడికి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయమన్నారు.

April 15, 2026 / 03:46 PM IST

151వ రోజుకు చేరిన ఆదోని జిల్లా సాధన దీక్షలు

KRNL: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు ఇవాళ 151వ రోజుకు చేరుకున్నాయి. ప్రాంతంలో కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

April 15, 2026 / 03:45 PM IST

రాజమండ్రిలో జనసేన పార్టీలోకి చేరికలు

E.G: రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో తలారి శ్రీను ఆధ్వర్యంలో బుధవారం పార్టీలోకి పలువురు చేరారు. ఈ సందర్భంగా వారికి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రియ సౌజన్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్ధాంతాలు, పరిపాలన విధానం ప్రజలపట్ల ఆకర్షితులే పార్టీలోకి చేరారన్నారు.

April 15, 2026 / 03:43 PM IST

‘ఓటర్ జాబితా విడుదల’

ASR: గూడెంకొత్తవీధి మండల తహసీల్దార్ కార్యాలయంలో 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ జాబితాను బుధవారం విడుదల చేశారు. ఎంపీడీవో రమణబాబు, తహసీల్దార్ అన్నజీరావు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ ఈ జాబితాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.

April 15, 2026 / 03:42 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

E G: రాజానగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ప్రారంభించారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే అన్నం వడ్డించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తుందని పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 15, 2026 / 03:38 PM IST

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్యే

TPT: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ఎంపికయ్యారు. ఈయన నియామకం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

April 15, 2026 / 03:17 PM IST

ఎలమంచిలిలో మాక్ డ్రిల్

AKP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల సమయంలో నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే, ఎస్. రాయవరం అడ్డరోడ్డు జంక్షన్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన కల్పించారు.

April 15, 2026 / 03:06 PM IST

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి కుమారి అనే యువతి గదిలో ఉరేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

April 15, 2026 / 03:05 PM IST

త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభం

AKP: పాయకరావుపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అన్న క్యాంటీన్ పనులను బుధవారం మండల అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వరహాలు బాబు, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు.

April 15, 2026 / 02:36 PM IST

గుంతకల్లు మీదుగా సమ్మర్ స్పెషల్ రైలు

ATP: ముంబై(CSMT) నుంచి చెన్నై వెళ్లే సమ్మర్ స్పెషల్ రైలు, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ రైలు ప్రతి ఆదివారం ముంబై (రైలు నెం 01015) నుంచి బయలుదేరుతున్నట్లు తెలిపారు. చెన్నై (రైలు నెం 01016) నుంచి ప్రతి సోమవారం బయలుదేరనుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు రద్దీ రీత్యా నడపనున్నట్లు తెలిపారు.

April 15, 2026 / 01:58 PM IST

‘కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’

VZM: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు సమక్షంలో బొబ్బిలిలో 9వ వార్డుకు చెందిన ముడశల దుర్గాప్రసాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలోని 36 వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు.

April 15, 2026 / 01:53 PM IST

‘స్వర్ణ పంచాయతీ సేవలు ప్రజలకు సక్రమంగా అందాలి’

ASR: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆయన బుధవారం చింతూరు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనమిత్ర యాప్ ద్వారా అందుతున్న సేవలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.

April 15, 2026 / 01:35 PM IST