GNTR: రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల రోగికి మత్తు ఇవ్వకుండా మెలకువలోనే గుండె బైపాస్ ఆపరేషన్ చేశారు. గతంలో క్యాన్సర్ చికిత్సల వల్ల సదరు రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సాధారణ మత్తు ఇస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు భావించారు. దీంతో డాక్టర్ల బృందం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఈ సర్జరీని పూర్తి చేశారు.
ప్రకాశం: ఇటీవల మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని మహేంద్ర భార్య నాగమణికి అందజేశారు.
NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన కంకర కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కంకరపై వాహనం జారి కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గుర్తించి వెంటనే డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ELR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, టి.నర్సాపురం ఎస్సై జయబాబు విగ్రహ కమిటీ సభ్యులకు, యువతకు పలు కీలక సూచనలు చేశారు. మహనీయుని జయంతి వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో మరియు ఘనంగా నిర్వహించు కోవాలని కోరారు. ప్రతి విగ్రహం వద్ద తప్పనిసరిగా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని RDO కార్యాలయంలో నిర్వహించిన ఏపీ బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ కార్యక్రమంలో MLA దస్తగిరి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, మహిళలు, యువత అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిందని తెలిపారు. మొత్తం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కోడుమూరు నియోజకవర్గానికి రూ.362 కోట్లు కేటాయించారని తెలిపారు.
KDP: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని DYFI జిల్లా కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేస్తూ, టీచర్లకు మాత్రం 10 నెలల జీతం మాత్రమే ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. వేసవిలో జీతం లేక టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
VZM: ఒడిశా నుంచి విశాఖకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించగా, ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
CTR: జగ్జీవన్ రామ్ 119వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష శనివారం తెలిపారు. నగరంలోని గంగినేని చెరువు కట్ట వద్దగల జగ్జీవన్ రామ్ విగ్రహాం వద్ద నివాళులర్పించిన అనంతరం బీ. ఆర్. అంబేద్కర్ భవనము వరకు, చిత్ర పటములతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల అధికారులు హాజరుకావాలని కోరారు.
VSP: కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) సధారాణి రేలంగి ఈ నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆరో తేదీన ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. అనంతరం ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
TPT: మాయాపూర్ హరే రామ హరే కృష్ణ ఆలయ రెండవ పీఠాధిపతి జననీవాస్ మహరాజ్, తిరుపతి హరే రామ హరే కృష్ణ ఆలయ పీఠాధిపతి నీలా పారాయణ ప్రభు నాగలాపురం వేదనారాయణ స్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ ప్రాధాన్యంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
KKD: సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద పశువులకు మేత పట్టుకుని వెళుతుండగా, బొలెరో వ్యాన్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి , ఆయనను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
W.G: పెనుమంట్ర మండలం మాముడూరులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) మృతి చెందారు. సత్తెమ్మ తల్లి ఆలయ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద మట్టి పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్ను రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు.
NDL: నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన చాకలి తిప్పన్నకు రూ.55,000, పందిపర్తి గ్రామానికి చెందిన ఉప్పర వసంత కుమారికి రూ.66,750 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు సహాయంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆదుకుంటామన్నారు.
E.G: ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న కడియం మండలం జేగురుపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శనివారం ఘనంగా సత్కరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసరావు ఆద్వర్యంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఉప సర్పంచ్ పాతూరి రాజేష్, వార్డు సభ్యులను, ఎంపీటీసీలు నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, ఆకుల సుధాకర్లను ఘనంగా సత్కరించారు.