CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.
కడప జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని SP నచికేత్ హెచ్చరించారు. బైకర్లు హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలన్నారు. బుధవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ.59,325ల జరిమానా విధించినట్లు వెల్లడించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.
KRNL: ఈనెల 19వ తేదీన కర్నూలు స్టేడియంలోని క్రికెట్ నెట్స్లో అండర్-16 బాలుర విభాగంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన వెల్లడించారు.
W.G: అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్మిష్ వర్మ భూపతిరాజును కలెక్టర్ నాగరాణి బుధవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు శిఖరాలు, ఏడు అగ్నిపర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా అన్మిష్ రికార్డు సృష్టించడం గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ఇవాళ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం పట్టణంలో జరుగుతున్న అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమని సీఐ వెంకట చలపతి తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా, మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అనకాపల్లి: రహదారి నిబంధనలు అతిక్రమించడంతో పాటు టోల్ ఫీజును ఎగ్గొట్టేందుకు అడ్డదారిన వెళుతున్న మూడు టిప్పర్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. నక్కపల్లి మండలం ఉపమాక మీదుగా వెళుతున్న మూడు లారీలను ఎస్సై సన్నిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని ఆర్టీఓకు అప్పగించారు. ఒక లారీకి రూ.56,000, మరో లారీకి రూ.66,000, మూడవ లారీకి 74,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
NLR: గుడ్లూరు చేవూరులో మామిడి తోటల భూసేకరణ పరిహారంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉద్యానశాఖ బుధవారం సాయంత్రం దర్యాప్తు ప్రారంభించింది. శాఖ ID మునిరెడ్డి, అధికారులు చేవూరులో విచారణ చేపట్టారు. 53 మంది రైతులకు చెందిన 130 ఎకరాల్లోని మామిడి చెట్లకు పరిహారం చెల్లింపులో అక్రమాలు ఏ మేరకు జరిగాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు
ప్రకాశం: త్రిపురాంతకం (M) రాజుపాలెం BTC కాలనీ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెంకు చెందిన శివన్నారాయణ బైక్పై మార్కాపురం నుంచి రాజుపాలెం వస్తుండగా.. రోడ్డుపై మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉన్న లారీని వెనుక భాగాన ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సత్యసాయి: మహిళా బిల్లుకు మద్దతు తెలిపేందుకు మంత్రి సవిత ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్లో ఈ కీలక బిల్లుపై నేడు జరిగే చర్చను ఆమె ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మహిళా సాధికారతకు ఈ చట్టం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా పెద్దపీట వేసినట్లవుతుందని వెల్లడించారు.
KKD: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం హెల్త్ స్కీమ్ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో జారీ చేసిందని కాకినాడ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప తెలిపారు. కాకినాడ జిల్లాలో అక్రిడిటేషన్ https://www.cfms.ap.gov.in వెబ్సైట్ ద్వారా రూ.1,250 చెల్లించి, ఆ వివరాలను స్థానిక కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
CTR: ఇంటర్ ఫలితాలలో కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటినట్టు సమగ్ర శిక్ష ఏపిసీ వెంకటరమణ తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 97%, సెకండ్ ఇయర్లో 96% మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రొంపిచర్ల, కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, పుంగనూరు కేజీబీవీలో 100% ఫలితాలు నమోదు అయ్యాయి అన్నారు. ఫస్ట్ ఇయర్లో 302 మందికి 292 మంది, సెకండ్ ఇయర్లో 273 మందికి 262 మంది పాసయ్యారు.
ATP: మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు అనంతపురం నేతలు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
విజయనగరం: జనగణనలో భాగంగా స్వీయ గణన సౌకర్యం నేటి నుంచి ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు se.census.gov.in వెబ్సైట్లో మొబైల్ నంబర్తో లాగిన్ అయి OTP ద్వారా నమోదు చేసి, 34 ప్రశ్నలతో తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే రిఫరెన్స్ ఐడీని ఎన్యూమరేటరు ఇవ్వాలని తెలిపారు.
SKLM: కవిటి (M) రాజపురం ఉపకేంద్రంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. కవిటి, రాజపురం తదితర గ్రామాలలో ఉ. 9 గంటల నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
VZM: సహకార రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కూటమి ప్రబుత్వ లక్ష్యమని జిల్లా DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఇవాళ విజయవాడలో జరిగిన APCOB జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం మరింత పారదర్శక, సమర్థవంతమైన సేవలు అందించేందుకు ప్రబుత్వ కట్టుబడి ఉందని తెలిపారు.