• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి..!

ELR: సుమారు రెండు నెలల క్రితం మన్యం వాసులను గడగడలాడించిన పెద్దపులి తిరిగి మళ్లీ పోలవరంలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులికి గతంలో జూలో అమర్చిన రేడియో ట్రాకింగ్ సిస్టం ద్వారా దాని ఉనికి గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖాళీ చేయబడిన నిర్వాసిత ప్రాంతం వాడపల్లి సమీపంలో సంచరిస్తున్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 11, 2026 / 03:30 PM IST

వసతి గృహాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో CSR నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో రూ.15 లక్షల వ్యయంతో మరమ్మతు పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ ప్రతినిధులు రాజేశ్, దేవరాజులను శనివారం ఆయన సన్మానించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పారిశ్రామిక సంస్థలు సహకరించాలని కోరారు.

April 11, 2026 / 03:30 PM IST

జిల్లా ప్రజలు.. జర జాగ్రత్త..!

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి చాలా ప్రాంతాల్లో 40°C పైగా నమోదయ్యాయి. వచ్చే రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని సూచించింది. నీరు ఎక్కువగా తాగడం, తలపై కవర్లు వాడటం, చిన్న పిల్లలను ఎండకు దూరంగా ఉంచాలని హెచ్చరించింది.

April 11, 2026 / 03:30 PM IST

బనవాసిలో టెక్స్‌టైల్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న MSME ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ పార్క్‌ను MLA బి.వి. జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమని పేర్కొన్నారు. పార్క్ స్థాపన ద్వారా చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

April 11, 2026 / 03:30 PM IST

‘వ్యవసాయ రంగానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి’

W.G: వ్యవసాయ రంగంలో స్థిరీకరణ నిధి ద్వారా రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి అన్నారు. శనివారం పెంటపాడు (M) జట్లపాలెం, కస్సా పెంటపాడు, యానాలపల్లి, దర్శిపర్రు, అలంపురంలో రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఏలూరులో జూన్ 3, 4, 5వ తేదీల్లో జరగనున్న రైతు మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

April 11, 2026 / 03:30 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన కొండయ్య

BPT: చీరాల పట్టణంలోని కొత్తపేట మూడు రోడ్ల సెంటర్‌లో కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చలివేంద్రం అనేది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, మనసులను కలిపే మానవత్వపు చిహ్నం. ఒక గ్లాస్ నీరు కూడా ప్రాణాన్ని కాపాడగలదు” అని పేర్కొన్నారు.

April 11, 2026 / 03:27 PM IST

PGRS నిర్వహించిన ఎమ్మెల్యే

విజయనగరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు.

April 11, 2026 / 03:26 PM IST

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

PLD: మాచర్ల పట్టణంలోని వడ్డెరపాలెంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నూతన పాలకమండలి సమావేశంలో పాల్గొని సభ్యులు చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాగద్వేషాలకు అతీతంగా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు.

April 11, 2026 / 03:25 PM IST

రోడ్డు మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: చందర్లపాడు మండలంలో నందిగామ-పొక్కునూరు రోడ్డు మరమ్మతు పనులకు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. మొత్తం రోడ్డు మెరుగుదల పనులకు రూ.280 లక్షలు అంచనా వేయగా, అదనపు ప్రణాళిక కింద నిధులు మంజూరు చేయబడ్డాయన్నారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని తెలిపారు.

April 11, 2026 / 03:23 PM IST

సరస్వతి పాఠశాలకు భారీ విరాళం

ATP: పామిడి సరస్వతి విద్యా మందిరం అభివృద్ధికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నూతన గదుల నిర్మాణం, ఇతర మరమ్మతుల కోసం తన సొంత నిధులు రూ.50 వేలు విద్యా మందిరం బృందానికి అందజేసి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించింది.

April 11, 2026 / 03:00 PM IST

జిల్లాలో వేప చెట్లకు ఎందుతెగులు

W.G: జిల్లాలో వేప చెట్లకు ఎందుతెగులు భారీగా వ్యాపించింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 80 శాతం చెట్లు ఈ వ్యాధి బారిన పడి వేప చెట్లు ఎండిపోతున్నాయి. ప్రతీ ఇంటి వద్ద వేప ఆకులతో సహా నిర్జీవంగా కనిపిస్తోంది. దీనిపై ఉద్యాన విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. గాల్ అనే వైరస్ సోకడంతో ఇలా జరుగుతుందని వివరించారు.

April 11, 2026 / 03:00 PM IST

బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని గుర్తుపెట్టుకుంటామని ఆయన అన్నారు.

April 11, 2026 / 03:00 PM IST

రాయచోటిలో ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ వెలుగులు

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో తొలి దశలో 2,784 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు కాగా, రూ.33.40 కోట్లతో ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబన పెరుగుతుంది.

April 11, 2026 / 03:00 PM IST

చెప్పినవన్నీ చేసి చూపుతాం: ఎమ్మెల్యే

CTR: వీ.కోట మండలంలో “మీ ఊరికి- మీ ఎమ్మెల్యే” కార్యక్రమం నాలుగో రోజు కొనసాగింది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చింతమాకులపల్లి, బోయ చిన్నాగానపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, ఇరిగేషన్, ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు.

April 11, 2026 / 03:00 PM IST

భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

VZM: భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఇవాళ సందర్శించారు. మన జిల్లాలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయంను చూసి పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారని ఆమె తెలిపారు.

April 11, 2026 / 02:58 PM IST