VZM: దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఈ నెల 21వ తేదీన చినజీయర్స్వామి వస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయ 11 గంటలకు నేదునురు సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పి గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.50 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.84 లక్షలు, ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా రూ.1.66 లక్షల మేర వసూలైనట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లెలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైక్పై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఆరు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా సీఐ వినోద్ కుమార్ చర్యలు చేపట్టి, ఆరు ఆటోలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
KDP: బద్వేలులోని 132-33 కేవీఏ సబ్ స్టేషన్లో నిర్వహణ పనులు చేస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు బద్వేలు, గోపవరం, అట్లూరు, బి. మఠం మండలాల పరిధిలోని సబ్ స్టేషన్లలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ఎం.కుళ్లాయప్ప, బద్వేలు ఏఈ మేరీ షర్మిళరాణి తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.
PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యధావిధిగా PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియవచ్చన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు.
బాపట్ల: మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీం నిర్వహిస్తున్న ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర బాపట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ రాంబాబు బృందాన్ని అభినందించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రజలకు డ్రగ్స్ ప్రమాదాలపై వివరించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
KRNL: కొత్తపల్లి మండలంలో ఉల్లి రైతులు క్వింటాకు రూ.300 ధర పడిపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో వారి ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, మద్దతు ధరతో ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
W.G: వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా రూ.14 లక్షల కోట్లు అప్పు ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు మండలం ముద్దాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి నిమ్మల మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు విధ్వంసానికి దారి తీసిందని చెప్పారు.
ATP: ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ విరమణ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం రాప్తాడులో రాక్షస పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పేరూరు డ్యాంకు నీరు అందించి రైతులను ఆదుకున్నామని, MLA సునీత మాత్రం నియోజకవర్గానికి కరువును కానుకగా ఇచ్చారని విమర్శించారు.
SKLM: శ్రీకాకుళం జెమ్స్ గ్రౌండ్స్లో సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ సిక్కోలు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ముగింపు పోటీలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా ఖ్యాతిని వివరిస్తూ, సానుకూల కథనాలను ప్రచారం చేయాలని కేంద్రమంత్రి అన్నారు కేంద్ర మంత్రి కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.
కోనసీమ: కోడిగుడ్డు ధర రూ.5.10 చేరింది. ఈ నెల 7వ తేదీన రూ.4.35 ఉన్న కోడిగుడ్డు రోజు రోజుకి పెరుగుతూ ఈ ధరకు చేరింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో నెల రోజుల కిందట కోడిగుడ్డు ధర రూ.3.80పైసలకు దిగజారడంతో రైతులు నష్టాలు చెవిచూశారు. ప్రస్తుతం కోడిగుడ్లకు డిమాండ్ నెల కొనడంతో ధర పెరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
W.G: కోళ్లపర్రు 33/11 KV విద్యుత్ ఉపకేంద్రంలోని 11KV కోళ్లపర్రు ఫీడర్ వార్షిక మరమ్మతుల్లో భాగంగా చెట్లు ఆకులు తొలగించనున్నారని ఈఈ వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా నేడు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కోళ్లపర్రు, ఆకివీడు, నక్కలపుంత పరిధిలోని ఆక్వా చెరువుల లైన్లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు.
KDP: నేర ప్రవృత్తిని వీడి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని DSP వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం JMD పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తామని, అలాగే బైండోవర్ వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSP స్పష్టం చేశారు. ఇందులో అర్బన్ సీఐ నరేశ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.