• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రాణం ఖరీదు రూ.26 కోట్లు

GNTR: తెనాలికి చెందిన చిన్నారి అశ్వర్త్ గురుదత్త అరుదైన DMD వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.26 కోట్లు అని వైద్యులు తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్స్‌ను ఆశ్రయించి ప్రజలు, ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు బాబు తండ్రి హరీష్ కుమార్ నంబర్ 9700365341ను సంప్రదించగలరు.

April 11, 2026 / 09:01 PM IST

జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ

TPT: శ్రీకాళహస్తిలో ఈనెల 15న జరగనున్న జాబ్ మేళా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆవిష్కరించారు. జేఎన్టీయూఏ–స్కిట్‌లో నిర్వహించే ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొని 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 11, 2026 / 09:00 PM IST

మద్దిలేటి స్వామి సన్నిధిలో MLA కోట్ల పూజలు

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్‌.ఎస్‌. రంగాపురంలో వెలసిన శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 11, 2026 / 09:00 PM IST

అక్రమ కట్టడాల తొలగింపులో అంతరాయం

NLR: బుచ్చి పట్టణం పెద్దూరులో అనుమతులు లేకుండా గుడిని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తుండటంతో సుమతి అనే మహిళ అడ్డుకుంది. తనను JCBతో కొట్టిన తర్వాతే ధ్వంసం చేయాలని బైఠాయించింది. గ్రామానికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో గుడిని ఏర్పాటు చేస్తున్నామని… రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.

April 11, 2026 / 08:56 PM IST

అర్ధవీడులో బాలుడు అదృశ్యం

ప్రకాశం: అర్ధవీడు మండలానికి చెందిన బైనముక్కల రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం అతను కనిపించకుండా పోయినట్లు బాలుడి తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటికే అర్ధవీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే దయచేసి 7032669045 నంబర్‌కు సమాచారం అందించాలని బాలుడి తల్లి విజ్ఞప్తి చేసింది.

April 11, 2026 / 08:46 PM IST

కోర్టును మభ్యపెట్టడంతో నిందితుడికి రిమాండ్

VZM: 2024 ఎస్.కోట పోలీసు స్టేషన్‌లో గంజాయి కేసులో రెండో ముద్దాయి నక్క వెంకటరమణపై నమోదైన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ నారాయణమూర్తి శనివారం తెలిపారు. నాసిక్ చెందిన జావేద్‌కు బెయిల్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పత్రాలు పరిశీలించగా తప్పుడు పత్రాలుగా తేల్చడంతో కేసు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

April 11, 2026 / 08:43 PM IST

ఎర్రగుంట్లపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామ పరిధిలోని NSP కాల్వ లాకుల వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు సుమారు 40-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని ఎడమ చేతిపై “ఫరోన్ ఇమాన్ షా” అనే పచ్చబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

April 11, 2026 / 08:32 PM IST

మైసూరు రైలుకు కొత్తవలసలో హాల్ట్

VZM: రైలు నంబరు 06251/52 మైసూరు న్యూ జలపాయిగురి జంక్షన్ మైసూరు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం శనివారం తెలిపారు. ఈ రైలు 17, 24 తేదీల్లో మైసూరులో ప్రతి శుక్రవారం 16.40 బయలుదేరి శనివారం మధ్యాహ్నం 15.10 కొత్తవలసకు వస్తుందన్నారు. న్యూ జలపాయిగురి జంక్షన్‌లో 20, 27 ప్రతి సోమవారం 16.45 బయలుదేరి మంగళవారం 16.30కు వస్తుందన్నారు.

April 11, 2026 / 08:31 PM IST

పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు.

April 11, 2026 / 08:31 PM IST

కలుదేవకుంటలో పట్ట పగలే దొంగలు హల్‌చల్

KRNL: మంత్రాలయం మండల పరిధిలోని కలుదేవకుంట గ్రామంలో పట్ట పగలే దొంగలు ఓ ఇంట్లో రూ.50 వేల నగదును చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్ తెలిపారు. శనివారం ఉదయం తన అన్న కుమారుడికి సంబంధం మాట్లాడేందుకు గ్రామంలోనే తన అన్న ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును దోచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.

April 11, 2026 / 08:30 PM IST

ఊటుకూరు వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

KDP: సి.కె దిన్నె పరిధిలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో ఊటుకూరు సర్కిల్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 11, 2026 / 08:30 PM IST

‘వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు’

W.G: జిల్లాలోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను మరో ఏడాది అనగా 2026-27కు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జీవోఎంఎస్  43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 11, 2026 / 08:30 PM IST

ఆర్టీఐ స్టేట్ సెక్రటరీగా రామారావు

SKLM: సరుబుజ్జిలికి చెందిన భద్ర రామారావును వైసీపీ ఆర్టీఐ విభాగం స్టేట్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకానికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైసీపీ ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఆర్టీఐ విభాగ రాష్ట్రస్థాయి సమావేశంలో శనివారం అభినందనలు తెలిపారు.

April 11, 2026 / 08:19 PM IST

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

VZM: నెల్లిమర్ల మండలంలోని టెక్కలి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు శనివారం టెక్కలి జనసేన పార్టీ నాయకులు మోయిద జగదీష్ అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా జనసేన వైపు వస్తున్నారని ఆమె అన్నారు.

April 11, 2026 / 08:12 PM IST

నీలకంఠాపురంలో వాహన తనిఖీలు

PPM: నీలకంఠాపురం ప్రధాన రహదారిపై ఎస్సై నీలకంఠ రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

April 11, 2026 / 08:06 PM IST