కర్నూలు: పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని, ఆ వాహనాలను కొని ఇబ్బందులు పాలవ్వకూడదని జిల్లా ప్రజలకు తెలిపారు.మోటారు వాహనాల చట్టం ప్రకారం, సరైన పత్రాలు లేని వాహనాలను కలిగి ఉండటం లేదా నేరమని తెలిపారు.
W,G: తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద క్యూబాకు మద్దతుగా జోలిపట్టి కార్యక్రమం గురువారం సీపీఎం నేతలు నిర్వహించారు. ఇరాన్ తర్వాత క్యూబా దేశంపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో పాటు ఆ దేశానికి వచ్చే ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు అన్నారు.
అన్నమయ్య: రాయచోటీ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. ట్రైనర్లు గౌస్ పీర్, ఇంతియాజ్ ఖాన్, జఫరుద్దీన్, వెంకట రమణ శిక్షణ అందించారు. రెండు బ్యాచ్లుగా 50 మందికి చొప్పున డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై వివరించారు. ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు ఇచ్చారు.
PLD: నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.
KDP: మైలవరం మండల తహశీల్దార్ ఓతూరు షఫీ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ముద్దునూరు MLS పాయింట్లో డిప్యూటీ తహశీల్దార్గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ పనులు, రీసర్వే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ASR: పట్టాదారు పాస్ పుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు ఏవో పీ.శివరామ్ ప్రసాద్ సూచించారు. కొయ్యూరు మండలం రావణాపల్లిలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు.
VSP: విశాఖ ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనుసంధాన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవివరం నుంచి వివిధ మార్గాల్లో పనుల నాణ్యతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారం నాటికి ప్రధాన రహదారుల పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
SS: పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో గురువారం పౌరసరఫరాల శాఖపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు డోర్ డెలివరీ విధిగా చేయాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం నాణ్యతపై వినియోగదారుల సంతృప్తిని పెంచాలని సూచించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కనకదుర్గమ్మ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరగనుంది. గతంలో జొన్నవాడ ఆలయ ఛైర్మన్గా విశేష సేవలందించిన పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడును ఈ ఆలయ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీ. ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.
ATP: జిల్లాలోని పర్యాటక ప్రాపర్టీల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. మారూరు టోల్ గేట్ రెస్టారెంట్, తాడిపత్రి హోటల్, ఎంపీఆర్ డ్యామ్ రెస్ట్ హౌస్ భవనాలను వార్షిక లీజు పద్ధతిలో కేటాయించనున్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16వ తేదీలోపు పర్యాటక కార్యాలయంలో వివరాలు పొందవచ్చన్నారు. కాగా, ఏప్రిల్ 17న వేలం ఉంటుందని వెల్లడించారు.
SKLM: జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత రీ సర్వే జరగనున్నదని సర్వే, భూములు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జ్యోషిత అన్నారు. ఈ మేరకు గురువారం మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్ ఆధ్వర్యంలో రీ సర్వేపై గ్రామ సర్వేయర్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. రీ సర్వే సమయంలో ఈకేవైసీ చేయాలని, రైతులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
PPM: భామిని మండలం చిన్న దిమిలి గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రేషన్ షాపును పరిశీలించి రికార్డులు, సరుకుల పంపిణీపై ఆరా తీశారు. ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.
VZM: గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ గురువారం సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. అలాగే, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
గుంటూరులో మండుతున్న ఎండల మధ్య తాటి ముంజెలకు మంచి ఆదరణ లభిస్తోంది. వడదెబ్బ తగలకుండా శరీరానికి చల్లదనాన్ని అందించి, ఆరోగ్యాన్ని కాపాడతాయని పూర్వీకులు చెప్పే ఈ సహజ ఆహారాన్ని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. గంటల వ్యవధిలో ముంజెలు అమ్ముడైపోతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.