ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నేడు జరగాల్సిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) రద్దు అయింది. బందోబస్తు, భద్రతా విధుల్లో పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
E.G: గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం రాజమండ్రిలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఏలూరు రేంజ్ డీఐజీ, వివిధ జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు హాజరయ్యారు. పుష్కరాల నిర్వాహణకు సమగ్ర ప్రణాళిక రూపొదించాలన్నారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాయలంలో ఆర్జిత సేవలను నేటి నుంచి మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. అర్చన చేయించాలంటే భక్తులు రుసుం రూ.10 చెల్లించాలని వివరించారు. అంతరాలయం ప్రవేశం (ఇద్దరికీ) రూ.50,ప్రతినెలా మాస పౌర్ణమికి జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలంటే రూ.వెయ్యి చెల్లిస్తే ఇద్దరికీ అనుమతిస్తామని వివరించారు.
VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం భోగాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించామని, విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి సులభంగా రాకపోకలు కల్పించేలా రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
SKLM: ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకు చెందిన కామేశ్వరరావు, వనజాక్షి దంపతులు ఆదివారం రాత్రి రాంగ్ రూట్లో బైక్పై వెళ్తుండగా ఎచర్ల మండలం, కేశవరావు పేట వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వనజాక్షి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందగా, కామేశ్వరరావుకు కాలికి గాయమైంది.
విశాఖ: తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన అల్లూరి మణికుమారి(58) విశాఖ సిరిపురంలో గల తన కుమార్తె శిరీష నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్సై చిన్నం నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికి మండలం వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని, అక్కడ నుంచి పెండేకల్లు రిజర్వాయర్ను సందర్శిస్తారు. అనంతరం యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించే ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పలువురు అధికారులు తెలిపారు.
SS: రామగిరి మండలం నసనకోటలో అమరావతి రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు ‘మా అమరావతి’ అంటూ వేసిన రంగవల్లులను ఆమె పరిశీలించారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన నాగసుధ, నాగమణి, సరితలకు బహుమతులు అందజేసి శాలువాలతో సత్కరించారు.
KDP: విద్యుత్ సమస్యల పరిష్కారానికి నేడు తన కార్యాలయంలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12.30 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు సెల్ నెంబరు 8977716661కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు డయల్ యువర్ SE కార్యక్రమం ఉంటుందన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీఎస్ఐ ఆలయ నిర్మాణం కోసం గ్రామానికి చెందిన గుమ్మల రాజేష్ దంపతులు రూ. లక్ష విరాళం అందజేశారు. ఈస్టర్ సందర్భంగా స్థానిక సంఘ కాపరి ముత్తు మనోహర్ బాబుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. చర్చి అభివృద్ధికి భక్తుల సహకారం ఎంతో అవసరమని పాస్టర్ పేర్కొన్నారు. రాజేష్ దాతృత్వాన్ని అభినందించారు.
ELR: నూజివీడులో ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో రెండు నిండు ప్రాణాలు కాపాడడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి తన మైనర్ కుమార్తెలను హింసిస్తూ ఉండగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసేందుకు ఆటో ఎక్కారు. వారి మాటలను గమనించిన డ్రైవర్ పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు సురక్షితంగా ఉన్నారు.
NDL: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు ఇచ్చిన జీఓ 98 హామీ నెరవేర్చాలని నిర్వాసితుడు జయన్న డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరులో 98GO బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ..32 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూసి చనిపోయారని, ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇందులో బాధితులు పాల్గొన్నారు.
KDP: కలసపాడులో సగిలేరు నది ఒడ్డున ఉన్న ఎస్పీజీ, పరిశుద్ధ పేతురు – పరిశుద్ధ పౌలు పట్టణ చర్చిలో ఈస్టర్ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. పునరుజ్జీవానికి గుర్తు, మరణంపై యేసుక్రీస్తు సాధించిన విజయానికి ప్రతీక ‘ఈస్టర్’ అని రెవరెండ్ సింగమల ఆశీశ్ గాబ్రియేల్ అన్నారు.
TPT: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బుర్ర ప్రియాంక ఇటీవల మరణించారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి ప్రమాద బీమా చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.