SS: రామగిరి మండలం నసనకోటలో అమరావతి రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మహిళలు ఇళ్ల ముందు ‘మా అమరావతి’ అంటూ వేసిన రంగవల్లులను ఆమె పరిశీలించారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన నాగసుధ, నాగమణి, సరితలకు బహుమతులు అందజేసి శాలువాలతో సత్కరించారు.