విజయనగరం జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రత తదితర సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.
VSP: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కమిషనర్ కేతన్ గార్గ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత ఆయన ఆశయాలని తెలిపారు.
TPT: పుత్తూరు, నారాయణవనంలో డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడుతూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసు సిబ్బందికి దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ యూనిఫామ్లను సిబ్బందికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసు సిబ్బంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.
VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పాల్గొని గ్రామస్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంటరానితన నిర్మూలన, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు.
TPT: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వడమాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PLD: రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి కె.పీ. జయన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.
సత్యసాయి: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్ మురళి నాయక్ త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. గోరంట్ల మండలం కల్లితాండాలో నిర్వహించిన ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నివాళులర్పించారు. మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమని, వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
BPT: అమృతలూరు మండలం ఇంటూరులో పీఎం సూర్యఘర్ ఎస్సీ, ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకంతో లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. వేమూరు నియోజకవర్గంలో 7,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.
GNTR: ఏపీ పర్యాటక శాఖతో ఆలివ్ హాస్పిటాలిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గుంటూరు, విశాఖ, తిరుపతి, విజయవాడల్లో మొత్తం 2,000 హోటల్ గదులను నిర్మించనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 55 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా గుంటూరు సహా ఆయా నగరాల్లో దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది.
SKLM: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు తాడి రాజేశ్ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిస్టులు సమాజానికి అవసరమని పేర్కొంటూ, రాజేశ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
CTR: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
VSP: సింహాచలం దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న నాదస్వర పాఠశాల విద్యార్థులకు మంగళవారం దేవస్థానం తరపున ప్రత్యేక వితరణ కార్యక్రమం నిర్వహించారు. నాదస్వరం, డోలు అభ్యసిస్తున్న విద్యార్థుల సాధన కోసం సుమారు రూ.లక్ష విలువగల డోలు వాయిద్యానికి అత్యంత కీలకమైన ఆకులు, మూతలు ఈఓ వెంకట్రావు అందజేశారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈవో పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
GNTR: అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ఏడీసీఎల్ చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.