అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
అన్నమయ్య: ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ‘యువగళం’ పుస్తకాన్ని అందజేసిన లోకేష్, రాష్ట్ర అభివృద్ధి మరియు యువత సాధికారతపై చర్చించారు. రవాణా సేవల మెరుగుదల, రోడ్డు భద్రత, క్రీడా అభివృద్ధిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీ బలోపేతం, సేవల విస్తరణపై కూడా చర్చించారు. మెరుగైన పాలన అందించాలనే దిశగా నిర్ణయించారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలో దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ను కోరారు. గురువారం తిరుపతికి వచ్చిన ఛైర్మన్కు స్వాగతం పలికిన అనంతరం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి దళితులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
విశాఖలో 20 మంది ట్రాన్స్జెండర్లు గురువారం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ స్వీపర్ ఉద్యోగాల్లో చేరిన వారికి 72 రోజుల జీతం జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. సీపీని పూలమాల, శాలువాతో సత్కరించారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గౌరవప్రద జీవనం సాధ్యమని సీపీ అన్నారు.
KRNL:‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సి.బెలగల్లో జిల్లా కలెక్టర్ సిరి, JC నూరుల్ ఖమర్ చెక్డ్యామ్ను పరిశీలించారు. నాగమ్మ చెరువును సందర్శించి నీటి నిల్వ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. సాగునీటి సదుపాయాల మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు నీటి వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిమితికి మించి ఎక్కించకూడదని, యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.
కృష్ణా: పెనమలూరు MLA బోడే ప్రసాద్కు గౌహతిలో టీడీపీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన పరిపాలన సాగుతుందని, అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
W.G: రబీ పంట కొనుగోలుకు ప్రభుత్వం కొత్త గోనెసంచులు ఇవ్వాలని, గత ఖరీఫ్ పంటకు రైతాంగానికి రావల్సిన రూ.15 కోట్లపై బడి రవాణా వాహన ఛార్జీలు వెంటనే ఇవ్వాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మార్టేరులో గురువారం జిల్లా కమిటీ సమావేశాన్ని అధ్యక్షుడు శ్రీనివాసరావు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే చిరిగిన గోనె సంచులతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు.
GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.
GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గుప్త కళాశాలలో తొలివిడత జనగణన శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో గురువారం జరిగినది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ విచ్చేసి సెక్రటరీలకు, టీచర్స్కు జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని వారు తెలిపారు.
KRNL: ఈ నెల 26, 27, 28వ తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు కార్మికులకు పిలుపునిచ్చారు. పత్తికొండలోని చదువుల రామయ్య భవన్లో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
NTR: చందర్లపాడు పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర-2.0లో భాగంగా గురువారం లక్ష్మీపురం మిర్చి పొలాల్లో కూబింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామసభలో గంజాయి వాడకం, సరఫరాపై చట్టపరమైన చర్యల గురించి వివరించారు. సమాచారం ఉంటే 1930, 1972కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, బాలల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.
VSP: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం ‘8వ పోషణ పక్వాడ’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో శిశువుల తొలి 1000 రోజుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పోషకాహారం, ఆరోగ్యకర అలవాట్లపై అవగాహన పెంచుతూ, జంక్ ఫుడ్ నియంత్రణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో వేసవి దృష్ట్యా ప్రజల కోసం చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా.ప్రమీల దేవి సూచనలతో, ఇంఛార్జ్ సూపరింటెండెంట్ డా.నిర్మలాదేవి సహకారంతో సివిల్ సర్జన్ డా. రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాత శ్రీ పెడమాళ్ల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 12వ డివిజన్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి అత్యవసరమని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్తంభాల మార్పిడి చేయాలని సూచించారు.