ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ను శుక్రవారం వారి నివాసంలో నూతనంగా నియమించిన గుత్తి మండల తెలుగు యువత అధ్యక్షులు కిట్ట యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కిట్ట యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు దానికి సహకరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.
KKD: సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిలరాజప్ప శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి, అధికారుల ద్వారా వాటికి పరిష్కారాలకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చిన్న రాజప్ప తెలిపారు. అధికారులు సీఎం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు
E.G: రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఘన స్వాగతం పలికారు. ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్నాతకోత్సవం, పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనున్నారు.
ASR: రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 65 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి సుష్మ తెలిపారు. వీరిలో 37మంది హైరిస్క్తో ఉన్నట్లు గుర్తించామని వీరికి ప్రత్యేక వైద్య సహాయం, మందులు అందజేస్తున్నామన్నారు. గర్భిణులు బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే, పెరట్లో లభించే ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
NDL: పాఠశాల ఆవరణలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శక్తి టీం సభ్యులు సూచించారు. శుక్రవారం కౌలూరు ప్రాథమిక పాఠశాలలో ఏఎస్పీ ఆదేశాల మేరకు శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ విద్యార్థులకు ‘బ్యాడ్ టచ్’ గురించి వివరించారు. అందరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
PPM: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, ప్రజలు రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని గుర్తు చేశారు.
SKLM: ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. హిరమండలం మండలం గుళుమూరులో శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఈపద్ధతి వలన కొంతమందికి హాజరుపడక ఇబ్బంది పడుతున్నారని, దీనివలన వేతనం నష్టపోతున్నారన్నారు.
ATP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ భేటీలో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CTR: రేణిగుంట పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని ఈనెల 13వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు సంత గేటు మార్గంలో, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు నారాయణాద్రి ఆసుపత్రి మీదుగా వెళ్లాలని సూచించారు.
KRNL: దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన ఎల్.ప్రేమనాథరెడ్డి వైసీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.
CTR: నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు . కళాశాలలో రూ. 35 లక్షలతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
W.G: మొగల్తూరు మండలం వారతిప్పలో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. నిషేధం అమలులో ఉన్నా నిర్వాహకులు బహిరంగంగానే స్థావరాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ జూదాన్ని అరికట్టాలని తెలిపారు.
BPT: కొత్తపేట సంపత్ నగర్లో నూతనంగా నిర్మించిన Chirala Aromas Restaurantను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ను ప్రారంభించిన అనంతరం, వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
GNTR: విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించి, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు, ఎఫ్సీఆర్ఏ నియంత్రణ సవరణ బిల్లును పునః పరిశీలించాలని విలేకరుల సమావేశంలో ఆయన కోరారు.
W.G: పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారిని స్విట్జర్లాండ్ సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ, పాలకొల్లుకు చెందిన బి.సత్యనారాయణ రాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.