ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనంతపురం రామ్నగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
సత్యసాయి: జాతీయ సమైక్యత శిబిరానికి కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర, NSS UNIT-1 విద్యార్థిని సారిక ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ స్మిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం మాండ్యలోని విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరంలో సారిక పాల్గొననున్నట్లు వెల్లడించారు.
E.G: రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత బిల్లును స్వాగతిస్తూ ఆదివారం రాజమండ్రిలోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ‘మన రాజధాని – మన అమరావతి’ అంటూ తెలుగు మహిళలు రంగవల్లులు వేశారు. వాటిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. ప్రజా రాజధానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
కోనసీమ: పేదరికంలో పుట్టి, రాజ్యాంగ రచనా సభ్యునిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కొత్తకోట ఎమ్మెల్యే బండారు సంత్యానందరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద DHPS ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు వీరేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
E.g: గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన బొనిగే లిఖి ప్రకాశ్ 24 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికై రికార్డు సృష్టించారు. తండ్రి వెంకట్రావు మేజిస్ట్రేట్ కాగా, తల్లి కోరిక మేరకు కష్టపడి ఈ విజయం సాధించినట్లు ప్రకాశ్ తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి చిరుప్రాయంలోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్యసాయి: బుక్కపట్నం మండలం రాసింపల్లి వద్ద సిద్ధరాంపురంలో చెరువుకు వెళ్లే కల్వర్టును మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా అక్కడ కొత్త కల్వర్టును నిర్మించాలని మండల నాయకులు ఆయనకు సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన మాజీ మంత్రి, కల్వర్టు నిర్మాణానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతపురం పీటీసీ సమీపంలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. వడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరుడు ఓబన్న విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించడం సంతోషకరమన్నారు. ఆయన ఆశయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
KRNL: ఆదోని మండలం మండిగిరి పంచాయతీకి చెందిన కురువ వాసుదేవ్, అన్నపూర్ణ దంపతులు ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేకపోయారని వారు విమర్శించారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.
అన్నమయ్య: చిట్వేలి- రాపూరు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. చిట్వేలి నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, నెల్లూరు నుంచి వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
KDP: సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామంలో ఈనెల 8వ తేదీ నుంచి శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 8వ తేదీన వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. 9వ తేదీన హోమాలు, గ్రామోత్సవం ఉంటుందన్నారు.10వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ, సాంస్కృతిక కార్యక్రమాలు, బండలాగుడు పోటీలు ఉంటాయని తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెంలో విద్యుత్ డివిజన్ పరిధిలో పట్టణ విద్యుత్ వినియోగదారుల మీటర్ల ఏరియా కోడ్ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మార్పు చేసిందనీ DE ఎం.వెంకటేశ్వర రావు ఇవాళ తెలిపారు. బిల్లింగ్ సిస్టమ్స్లో వచ్చిన మార్పుల ఆధారంగా మీటర్ సర్వీస్ నెంబర్స్ మార్పు జరిగిందని ఈనెల బిల్లులో కొత్త నెంబర్ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసంలో అమరావతి చట్టబద్ధతకు మద్దతుగా ఇంటి ముందు ముగ్గు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి లభించిన చట్టబద్ధత రాష్ట్ర ప్రజలందరి విజయమని, దేశం మొత్తం దీనికి బాసటగా నిలవడం చారిత్రాత్మకమని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి అభివృద్ధి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ప్రకాశం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడు ప్రవర్తన మహిళల పట్ల అసభ్యకరంగా ఉందని అన్నారు. హిందువుల పవిత్రతను కాపాడేందుకు వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్ని తొలగించాలన్నారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎమ్మెస్సెస్ భవన్లో భారతదేశ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సేవలను స్మరించారు.