అనంతపురం పీటీసీ సమీపంలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. వడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరుడు ఓబన్న విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించడం సంతోషకరమన్నారు. ఆయన ఆశయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.