E.g: గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన బొనిగే లిఖి ప్రకాశ్ 24 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికై రికార్డు సృష్టించారు. తండ్రి వెంకట్రావు మేజిస్ట్రేట్ కాగా, తల్లి కోరిక మేరకు కష్టపడి ఈ విజయం సాధించినట్లు ప్రకాశ్ తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి చిరుప్రాయంలోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.