W.G: ఉపాధి హామీ పనుల్లో ముఖ ఆధారిత ఫేస్ యాప్ను తక్షణమే రద్దు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, కౌరు పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మొగల్తూరులో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాత పద్ధతిలోనే మాన్యువల్ మస్తర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రూ. 280- 300 ఉన్న చికెన్ కేజీ ధర ప్రస్తుతం రూ. 260కు చేరింది. చేపలు కేజీ రూ.150, మటన్ కేజీ రూ.1000కు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. అధిక ఎండల ప్రభావంతో చికెన్కు డిమాండ్ తగ్గినట్లు సమాచారం.
TPT: తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శక్తి టీమ్ విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళా, బాలల భద్రతపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ ప్రాముఖ్యత, ఆన్లైన్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.
GNTR: ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా రానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన జీఎస్టీ, ఇతర రిజిస్ట్రేషన్లు, అనుమతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన మంగళగిరి సీఏ మద్ది నిఖిల్ను మంత్రి నారా లోకేష్ శనివారం ఉండవల్లి నివాసంలో అభినందించారు. రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుందని లోకేష్ తెలిపారు.
BPT: చీరాల మున్సిపల్ పరిధిలోని జిల్లా క్రీడా ఆడిటోరియం ఇండోర్ స్టేడియం సమీపంలోని ఫుట్పాత్ వద్ద ఉన్న మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ మూత దెబ్బతినడంతో అక్కడ సంచరించే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో శనివారం ఏసీబీ అధికారుల పేరుతో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోల నుంచి కేటుగాళ్లు నగదును దోచేశారు. ఏసీబీ అధికారులమని తమకు నగదు వేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించడంతో వీఆర్వో యేసయ్య రూ.1.50 లక్షల నగదును నకిలీ ఏసీబీ అధికారులకు ఫోన్ పే ద్వారా పంపాడు. తర్వాత విషయాన్ని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
VZM: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా SP దామోదర్ శనివారం హెచ్చరించారు. బెట్టింగ్లను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, వీటివల్ల యువత ఆర్థికంగా, విద్యాపరంగా...
ATP: పెద్దవడుగూరు మండలం అప్పెచర్ల గ్రామ సమీపంలోని 67 హైవేపై బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు. తల్లి భవాని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
NTR: రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈవీ బస్సులను విస్తరించి, పల్లెవెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ELR: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని 48 గంటల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన జూమ్ సమావేశంలో ఆమె జనగణన పురోగతిని సమీక్షించారు. 2011 జనాభా గణాంకాలతో పోల్చి చూస్తూ.. వ్యత్యాసాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా గణన చేపట్టాలని సూచించారు. శాశ్వత వలసదారులను సక్రమంగా నమోదు చేయాలని ఆమె అన్నారు.
W.G: జిల్లాలో నీటి కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా చెరువుల వ్యర్థ జలాలను డ్రైన్లు, కాలువల్లోకి నేరుగా వదలకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు.
KDP: దువ్వూరు మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో వల్లూరు మండలం కోట్లూరు గ్రామానికి ఈశ్వ ర్ను శనివారం అరెస్టు చేసినట్లు మైదుకూరు గ్రామీణ సీఐ జె.శివశంకర్, ఎస్సై ధనుంజయుడు తెలిపారు. నిందితుడిని మైదుకూరు కోర్టులో హజ రుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు.
CTR: ప్రభుత్వ, ప్రైవేటు ITIలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు https: //itiadmissions.ap.gov.in/iti/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
TPT: ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు భూ సేకరణ పనులను శనివారం పరిశీలించారు. కాలుష్య ప్రభావంతో తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్-2 గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు, భూ సేకరణ పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంగంపేట ఏపీఎండీసీ ముగ్గురాయి గనులను సందర్శించి ఖనిజ సంపద వివరాలను పరిశీలించారు.
ATP: నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ అసిస్టెంట్లకు 02, ల్యాబ్ అటెండర్లకు రెండు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మూడు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.