• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపల్

NDL: మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్లో ఈ నెల 12న జరగనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శుక్రవారం ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ. 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

April 10, 2026 / 12:25 PM IST

వంతెన కోసం వినూత్న ఆందోళన

PPM: పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి గాజులగూడలో మోకాళ్లపై నడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంతెన పూర్తైతే సుమారు 40 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

April 10, 2026 / 12:23 PM IST

రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

TPT: తిరుచానూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా? ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.

April 10, 2026 / 12:12 PM IST

అర్జీలు స్వీకరించిన సోమిరెడ్డి

NLR: తోటపల్లి గూడూరులో ప్రజాదర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనకు అర్జీలు ఇచ్చారు. సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు ఎస్. సురేష్ రెడ్డి, బి. సురేంద్ర పాల్గొన్నారు.

April 10, 2026 / 11:55 AM IST

జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ నియామకం

విశాఖ జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీగా 50వ వార్డు మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జగన్‌కు, జిల్లా అధ్యక్షుడు కె.కె రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

April 10, 2026 / 11:42 AM IST

పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం

VZM: పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే పోషణ్ పక్వాడా కార్యక్రమానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం తన ఛాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

April 10, 2026 / 11:41 AM IST

నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

NDL: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (RTE) కింద పేద విద్యార్థుల ఉచిత ప్రవేశాల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. చాగలమర్రి విద్యాశాఖ అధికారి న్యామతుల్లా మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాలతో బుధవారంతో ముగియాల్సిన గడువును మరో రెండు రోజులు పొడిగించారు. అర్హులైన విద్జార్థులు ఇవాళ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 10, 2026 / 11:30 AM IST

రేపు మాలకొండలో ధార్మిక సదస్సు

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 10 గంటలకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ఛైర్మన్ దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ధర్మ పరిరక్షణ, ప్రచారం, అభివృద్ధిపై ఆచార్యులు, అర్చక సంఘాలు సూచనలు ఇవ్వనున్నారు. అర్చకుల సమస్యలు కూడా చర్చించనున్నారు.

April 10, 2026 / 11:28 AM IST

కబడ్డీ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ

E.G: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం రాజమండ్రిలో ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరింపజేయడంతో పాటు, యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, క్రమశిక్షణ వంటి విలువలను క్రీడలు ఉపయోగపడతాయన్నారు.

April 10, 2026 / 11:23 AM IST

అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు..!

PPM: కొమరాడ మండలం కళ్లికోట గ్రామ సమీపంలోని నాగవళి నదీతీరంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులను ఇవ్వలేదు. అలాగే, అధికారికంగా ఇసుక ర్యాంపు కూడా లేదు. అయినా సరే రాత్రిపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వుతున్నారు. ఒక్కోట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.5 వేలకు పట్టణాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.

April 10, 2026 / 11:17 AM IST

ఉపాధి పనులను పరిశీలించిన ఏపీవో

AKP: ఉపాధి హామీ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. రోజు తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, కూలీల సంఖ్య తగ్గకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

April 10, 2026 / 11:14 AM IST

జిల్లాలో టీడీపీ మహానాడు..!

VZM: జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. భోగాపురం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. కాగా వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.

April 10, 2026 / 11:13 AM IST

‘ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు’

అన్నమయ్య: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించకూడదని అన్నమయ్య జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ షేక్ జాబీర్, ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దశలవారీ పోరాటంలో భాగంగా రాయచోటి బాలికోన్నత పాఠశాల పదవ తరగతి మూల్యాంకన కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

April 10, 2026 / 11:13 AM IST

పన్నుల వసూళ్లలో జిల్లా సరికొత్త రికార్డు

ASR: ఇంటి పన్నుల వసూళ్లలో ఉమ్మడి అల్లూరి జిల్లా రాష్టంలో ప్రథమంగా నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 22 మండలాల్లో 430 గ్రామ పంచాయతీలు ఉండగా, 414 పంచాయతీలు 100 శాతం పన్నులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా అవినీతికి తావులేకుండా రూ.12.05కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు.

April 10, 2026 / 11:11 AM IST

ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు తొలగింపు

CTR: తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో ముగ్గురిని తొలగించారు.

April 10, 2026 / 11:10 AM IST