• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: నాయక్ నగర్ స్మాష్ బ్యాడ్మింటన్ అకాడమీలో అండర్-17 బాల, బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని రాణించాలని సూచించారు.

October 5, 2025 / 03:20 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవినేని

NTR: విజయవాడ వాస్తవ్యులు శ్రీ కరణం జగన్‌మోహనరావు, జ్యోతి కుమారుడి వివాహ సందర్భంగా జరిగిన రిసెప్షన్ వేడుకలో, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వర రావు, పాల్గొన్నారు. ఆదివారం రోజు విజయవాడ A ప్లస్ కన్వెన్షన్ నందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు సూర్య తేజ, సాయితేజస్విలను, ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు.

October 5, 2025 / 03:18 PM IST

కుస్తీ పోటీల్లో సత్తా చాటిన మండపేట విద్యార్థి

కోనసీమ: కుస్తీ పోటీల్లో మండపేట ఎంపీఎస్ విద్యార్థి తాతపూడి నితీష్ బాబు విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అండర్ 14 యాభై రెండు కిలోల విభాగంలో ఈ పోటీలు కాకినాడ డీఎస్సీ గ్రౌండ్స్‌లో జరగగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. వారిలో నితీష్ బాబు ఒకరిగా ఉన్నాడు. ఈ సందర్భంగా నితీష్‌ను పలువురు అభినందించారు.

October 5, 2025 / 03:16 PM IST

మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ

W.G: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప.గో జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఎమ్మెల్సీ బి. గోపిమూర్తి భీమవరంలో ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీలో ఈకేవైసీ ఆధార్ అనుసంధానం పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించారని తెలిపారు. రైతు సంఘం నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ.. 33వ మహాసభ నవంబర్ 10,11 తేదీల్లో అత్తిలిలో జరుగుతుందన్నారు.

October 5, 2025 / 03:15 PM IST

మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కాట్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి

NDL: బనగానపల్లె మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కాట్ రెడ్డి మల్లికార్జున రెడ్డి, ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్‌ను అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.

October 5, 2025 / 03:14 PM IST

భక్తుల రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆలయ కమిటి

NTR: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2న ముగిసినప్పటికీ, ఆదివారం నాటికి భవానీ భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయమై ఈవో సేన, నూతన ఛైర్మన్ రాధాకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తగు చర్యలు తీసుకున్నారు.

October 5, 2025 / 03:13 PM IST

రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి

E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలో తమిళనాడు నుంచి బీహార్ వెళ్లే రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై పి.అప్పారావు మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 9347237683 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

October 5, 2025 / 03:12 PM IST

ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం

ప్రకాశం: ఒంగోలులోని ఎంసీయు భవనంలో ఆదివారం PDSU ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీలపై చర్చించారు. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజీలకు పీపీపీ వద్దని, పీజీపీ కావాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు మెడికల్ కాలేజీలు కేటాయించాలన్నారు.

October 5, 2025 / 03:10 PM IST

పిల్లలకు హ్యాపీ సండే కార్యక్రమం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ నగర్ సచివాలయం వద్ద పిల్లలకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు డాన్స్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, పాటలు పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమా, కమిషనర్ ప్రసాదరాజు పలువురు అధికారులు పాల్గొన్నారు.

October 5, 2025 / 03:09 PM IST

యుద్ధాలతో సాధించలేనిది జ్ఞానంతో సాధించారు: MLA

KRNL: ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, జ్ఞానంతోనే సాధించిన మహానీయుడు డాక్టర్ BR అంబేద్కర్ అని మంత్రాలయం MLA వై. బాలనాగిరెడ్డి అన్నారు. ఇవాళ పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

October 5, 2025 / 03:08 PM IST

‘ద్విచక్ర వాహన మెకానిక్‌ల సంక్షేమానికి కృషి’

EG: ద్విచక్ర వాహన మెకానిక్‌ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తమ భవాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర వాహన మెకానిక్‌లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి, ఇవాళ వాటి పత్రాలను వారికి అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

October 5, 2025 / 03:08 PM IST

కొత్తపేట ఎమ్మెల్యే పీఆర్‌వోగా ప్రసాద్ నాయుడు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన నియోజకవర్గ పీఆర్‌వో(ప్రజా సంబంధాల అధికారి)గా ప్రసాద్ నాయుడును నియమించారు. వాడపాలెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రసాద్ నాయుడు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు సమర్థవంతంగా మీడియాలో ప్రతిఫలించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

October 5, 2025 / 03:07 PM IST

మొక్కులు తీర్చుకున్న జనసేన జన నేతలు

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల జ్వరంతో బాధపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నగరంలోని ఆమని గార్డెన్స్‌లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి జనసేన జన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడడంతో ఇవాళ స్వామివారికి ఆకు పూజ తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

October 5, 2025 / 03:05 PM IST

భక్తులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు

NTR: ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు ముగిసి నాలుగు రోజులుగా వస్తున్న అమ్మవారి దేవాలయానికి భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత మూడు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. ఎక్కువ సంఖ్యలో భవాని భక్తులు అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజన వసతిని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

October 5, 2025 / 03:02 PM IST

యోగా పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు

SKLM: జిల్లాస్థాయి యోగా పోటీలలో రామకృష్ణాపురం శ్రీ సత్య సాయి విద్యావిహర్ విద్యార్థులు సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం జరిగిన పోటీలలో అండర్ 17 విభాగంలో టీ. జానకిరామ్, ఈ. చరణ్, జీ. దీక్షిత్‌లు అండర్ 14 విభాగంలో ఎం. జస్వంత్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు.

October 5, 2025 / 02:59 PM IST