• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీల సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి

ASR: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించాలని పలువురు పీహెచ్‌సీ వైద్యులు కోరారు. ఈ మేరకు సోమవారం అరకులో ఎంపీ డా.గుమ్మా తనూజా రాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. పీహెచ్‌సీల వైద్యుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. కానీ, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీంతో విధులను బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

September 29, 2025 / 07:18 PM IST

అభివృద్ధి పరుగులు పెడుతుంది: ఎమ్మెల్యే

KKD: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. సోమవారం తాళ్లరేవు మండలంలో సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు.

September 29, 2025 / 07:17 PM IST

‘తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’

ప్రకాశం: మహిళలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దారవీడు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ కవిత పేర్కొన్నారు. సోమవారం సుంకేసుల గ్రామంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

September 29, 2025 / 07:13 PM IST

అభయాంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

ELR: పెదపాడు మండలం అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఛైర్మన్, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

September 29, 2025 / 07:12 PM IST

నిధులు ఇవ్వాలని ఎంపీకి వినతి

KRNL: కోసిగి జాడే మల్లయ్య స్వామి దేవస్థానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును ఏపీ కురబ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కోరారు. అలాగే ఉప్పరహాల్, కౌతాళంలో, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. ఎంపీని కలిసిన వారిలో కురబ సంఘ అధ్యక్షుడు వీరేష్, ఉప్పరహాల్ టీడీపీ అధ్యక్షుడు ఈరన్న ఉన్నారు.

September 29, 2025 / 07:11 PM IST

టీడీపీలో చేరిన 40 కుటుంబాలు

ప్రకాశం: గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామానికి చెందిన 40 కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారిని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అందుకే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని అన్నారు.

September 29, 2025 / 07:05 PM IST

‘తాగునీరు కలుషితం అయ్యే ప్రాంతాలను గుర్తించండి’

E.G: నిడదవోలు, కోవూరు మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవోలు తాగునీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో జ్వరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో బోరు నీటిని కూడా పరీక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.

September 29, 2025 / 07:04 PM IST

PGRS ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ

PLD: నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ J.V. సంతోష్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి, మోసం వంటి 95 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయి. వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

September 29, 2025 / 07:03 PM IST

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ నెంబర్-1: కలెక్టర్

VSP: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో జరిగిన రీజనల్ అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అనేక పాలసీలు తెచ్చిందని పేర్కొన్నారు.

September 29, 2025 / 07:02 PM IST

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సర్వసభ్య సమావేశం

VZM: కొత్తవలస ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ కోళ్ల వెంకటరమణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 01 నుంచి 10 సెంట్లు భూమి కలిగిన ప్రతి రైతు రూ.400 చెల్లించి ఆ సంఘం సభ్యత్వం పొందాలని కోరారు. ఈ సభ్యత్వం వలన ఒక ఎకరం వ్యవసాయ భూమి కలిగిన వాళ్ళు 12% వడ్డీ రేటు చొప్పున రూ.5 లక్షల రుణం పొందుటకు అర్హులని పేర్కొన్నారు.

September 29, 2025 / 07:00 PM IST

రాజంపేటలో వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట

అన్నమయ్య: రాజంపేట మండలంలోని సానిపాయి గ్రామంలో సోమవారం శ్రీ సీతారాముల స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజంపేట TDP ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

September 29, 2025 / 06:58 PM IST

‘వాహనాలను డిస్పోజ్ చేయాలి’

VZM: వివిధ కేసుల్లోని వాహనాలను నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ దామోదర్ గజపతినగరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.

September 29, 2025 / 06:54 PM IST

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: రహమతుల్లా

KDP: కలసపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వైద్యులు శైలజ, సాయితేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు వచ్చిన మహిళలకు అన్ని రకముల వైద్య పరీక్షలు చేశామన్నారు. ఆరోగ్యంపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. ఏపీ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ రహమతుల్లా హాజరయ్యారు. అనంతరం ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

September 29, 2025 / 06:52 PM IST

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

GNTR: ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో సోమవారం సివిల్‌ రైట్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫిరంగిపురం ఏఎస్సై జాన్ ఖాన్ పాల్గొన్నారు.

September 29, 2025 / 06:52 PM IST

ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి అర్జీలను సోమవారం స్వీకరించారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు అర్జీలను కలెక్టర్ అందజేశారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

September 29, 2025 / 06:49 PM IST