• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీఎస్పీగా శ్రీహరి రాజు బాధ్యతలు స్వీకరణ

KKD: కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా శ్రీహరి రాజు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. డిఎస్పీగా సేవలు అందించిన లతా కుమారి విజయవాడకు బదిలీ కావడంతో… రాష్ట్ర ప్రభుత్వం నూతన డిఎస్పీగా శ్రీహరి రాజును నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

September 22, 2024 / 02:13 PM IST

VIDEO: ‘తమ హయాంలో ఏ రకమైన కల్తీ జరగలేదు’

TPT: తిరుపతి పట్టణంలోని పద్మావతిపురంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని భూమనపై ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. తమ హయాంలో ఏ రకమైన కల్తీ జరగలేదని చెప్పారు. తమపై చేసిన ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమని చాలెంజ్ విసిరారు.

September 22, 2024 / 02:10 PM IST

సీతంపేటలో 5D థియేటర్ ప్రారంభం

మన్యం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీన సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ 5D థియేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదివారంవీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.

September 22, 2024 / 02:09 PM IST

VIDEO: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విజయ్ కుమార్

GNTR: గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మస్తాన్ వలీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

September 22, 2024 / 02:05 PM IST

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవ’ అవగాహన ర్యాలీ

AKP: జిల్లాలోని ఎన్టీఆర్ మార్కెట్ ఆవరణలో యూనియన్ బ్యాంక్ అధికారులు సిబ్బంది ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంపై ఆదివారం ఉదయం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో రహదారులను శుభ్రం చేశారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

September 22, 2024 / 02:05 PM IST

ఆక్రమణల చెరలో బందర్ కాలువ

కృష్ణా: వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందిస్తూ.. లక్షల మంది రైతులు, కూలీలకు ఆసరాగా నిలుస్తూ.. కృష్ణ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న బందరు కాలువను ఆక్రమణలు చుట్టుముడుతున్నాయి. ఎగువన విజయవాడలోని కొందరు కాలువలో అక్రమంగా ఇళ్లు, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాల నిర్మాణాలను చేపడుతూ.. సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నారు.

September 22, 2024 / 02:02 PM IST

అన్న క్యాంటీన్లను ప్రారంభించిన MLA గౌరు చరితరెడ్డి

KRNL: కర్నూలు అర్బన్‌లోని 41వ వార్డు పరిమళ నగర్, 35వ వార్డు కర్నూల్ ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె వడ్డించి, ఆ తర్వాత భోజనం చేశారు. అనంతరం చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

September 22, 2024 / 02:02 PM IST

100రోజుల పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు : ఎమ్మెల్యే భాష్యం

PLD: క్రోసూరు మండలం 88 త్యాళ్లూరు గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రజలతో ముచ్చటించారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.3వేల పింఛన్‌ను రూ.4వేలు చేసిన ఘనత టీడీపీకే దక్కిందని అన్నారు. రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు మొత్తం ప్రజలకు చేరువ అవుతాయని చెప్పారు.

September 22, 2024 / 02:00 PM IST

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం: మండలంలోని వల్లూరమ్మ దేవస్థాన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం మధురైకు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

September 22, 2024 / 02:00 PM IST

అన్న క్యాంటీన్ కు రూ.15,000 విరాళం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని పెద్ద కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరులోని అన్న క్యాంటీన్ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ.15,000 నగదును ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరిని అభినందించారు.

September 22, 2024 / 02:00 PM IST

స్నేహశీలి సీతారాం ఏచూరి: మాజీ మంత్రి

VJM: స్నేహశీలి సీతారామ్ ఏచూరి అని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. విజయనగరంలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుపోయే వ్యక్తి అని అన్నారు. ఆయన సిద్ధాంతం కోసం చివరి వరకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.

September 22, 2024 / 02:00 PM IST

ఈనెల 24న మండల స్థాయి క్రీడా పోటీలు

NDL: బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 24న మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO స్వరూప ఓ ప్రకటనలో వెల్లడించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు, మండల కోఆర్డినేటర్‌కు తమ వివరాలను సమర్పించాలని ఎంఈవో సూచించారు. క్రీడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

September 22, 2024 / 01:58 PM IST

వేగంగా జరుగుతున్న రహదారి పనులు

ప్రకాశం: మండల కేంద్రంలోని నూతన సచివాలయం, రైతు సేవ కేంద్రాలు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలో ఈ భవనాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని సర్పంచ్ తాతపూడి సురేశ్ బాబు తెలిపారు. సచివాలయం రైతు సేవ కేంద్రానికి వెళ్ళేటకు రహదారి పనులను సర్పంచ్ సురేశ్ బాబు పర్యవేక్షించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రహదారికి కంకర చిప్స్ వేయించి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

September 22, 2024 / 01:53 PM IST

VIDEO: చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ASR: డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద ఆదివారం పర్యటకులు సందడి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం దేశ నలుమూలల నుండి చాపరాయి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయి వద్ద ఉన్న గార్డెన్ వద్ద పర్యటకులు సరదాగా గడిపారు, అలాగే దింసా నృత్యంలో పాల్గొని సందడి చేశారు.

September 22, 2024 / 01:53 PM IST

భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం

కృష్ణా: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించుకుని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

September 22, 2024 / 01:51 PM IST