కృష్ణా: మచిలీపట్నంలో నిర్వహించనున్న శక్తి పటాల ప్రదర్శనల్లో DJలకు అనుమతి లేదని DSP CH రాజా సోమవారం ప్రకటించారు. మూలా నక్షత్రం సందర్భంగా నగరంలోని శక్తి పటాలు అన్నీ సోమవారం రాత్రి కోనేరు సెంటర్కు చేరతాయన్నారు. ఈ క్రమంలో DJలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శక్తి పటాల ప్రదర్శకులు పోలీసు వారికి సహకరించాలన్నారు.