అన్నమయ్య: జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి వద్ద విద్యుత్ లైనుకు మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి పశ్చిమ బెంగాల్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్వబర్ధమాన్ జిల్లా, రామగోపాల్ పూర్కు చెందిన సంజయ్ బాగ్ది (32), ఓ లైన్మెన్కు సహాయకుడిగా పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. కాగా, ఘటనపై రాయచోటి ఏఎస్సై గోపి నాయక్ వివరాలు వెల్లడించారు.