• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆటో ప్రమాద బాధితునికి ఆర్థిక సహాయం

కృష్ణా: చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కుంభా రవితేజ ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడి, మంచానికే పరిమితం కావడంతో అతని వైద్య ఖర్చులకు దాతలు ఆదివారం రూ. 20 వేలను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ చేతులమీదుగా అందచేశారు. పంచాయతీ ద్వారా సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి రూ. 10వేలు, రావెళ్ల ఫౌండేషన్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ రూ. 8వేలు, మరొక దాత రూ. రెండు వేలు సమకూర్చారు.

October 5, 2025 / 04:05 PM IST

రేపు మచిలీపట్నంలో PGRS కార్యక్రమం

కృష్ణా: ఈ నెల 6వ తేదీన సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చన్నారు.

October 5, 2025 / 04:04 PM IST

‘పోలవరం ప్రాజెక్టు ఊసెత్తకపోవడం విడ్డూరంగా ఉంది’

ఏలూరు సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ఊసే తీయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

October 5, 2025 / 04:02 PM IST

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు PGRS

CTR: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 2వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

October 5, 2025 / 04:00 PM IST

శాంతిపురంలో 12 లక్షలతో సీసీ రోడ్ పనులు ప్రారంభం

CTR: శాంతిపురం(M) అనికెర పంచాయతీ వడగండ్లపల్లి ఎస్సీ కాలనీలో రూ.12 లక్షలతో మూడు సీసీ రోడ్డు పనులను మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తోందని, గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

October 5, 2025 / 03:59 PM IST

నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ. మూడు కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

October 5, 2025 / 03:58 PM IST

ఎస్. కోటలో ‘ఓట్ చోర్ గద్దె చోడ్’ కార్యక్రమం

VZM: ఎస్. కోట పంచాయతీ సీతంపేటలో ఆదివారం ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ కోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ప్రజలకు కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేశారు. దేశంలో ఓట్ల చోరీని అరికట్టేందుకు ఏఐసీసీ ఆదేశాలతో ఈ నెల 15 వరకు సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.

October 5, 2025 / 03:56 PM IST

రూ. 8 లక్షల నష్టపరిహార చెక్కును అందుచేత

SKLM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మందస మండలం సవర చిన్న టుబ్బూరు గ్రామంలో మట్టి గోడ కూలి మృతి చెందిన వృద్ద దంపతులు మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు పలాసలో వారి కుటుంబ సభ్యులకు రూ. 8 లక్షల నష్ట పరిహార చెక్కును అందజేశారు.

October 5, 2025 / 03:53 PM IST

పేరుపాలెం బీచ్‌కి పోటేత్తిన పర్యాటకులు

W.G: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పేరుపాలెం బీచ్‌కు ఆదివారం దసరా సెలవుల ఆఖరి రోజు కావడంతో పర్యాటకులు పోటెత్తారు. అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో వచ్చినవారు సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక నేలపై సరదాగా గడిపారు. తీరం వెంబడి గుర్రాలపై సవారీ చేస్తూ సందడి చేశారు.

October 5, 2025 / 03:49 PM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా సత్యకుమార్

కోనసీమ: పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన ప్రసిద్ధమైన అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా సత్యకుమార్ నియమితులయ్యారు. సత్యకుమార్ గతంలో వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా, అనంతరం కాకినాడ అన్నదాన సమాజం సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భక్తులకు మెరుగైన సేవలంధిస్తూ, ఆలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

October 5, 2025 / 03:49 PM IST

రేణిగుంటకు చేరుకున్న వెస్ట్ బెంగాల్ గవర్నర్

TPT: తిరుమల శ్రీవారి దర్శనార్థం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బెన్ వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్ట్ అధికారులు, స్థానిక ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు.

October 5, 2025 / 03:48 PM IST

లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి

కృష్ణా: గుడివాడ బిళ్లపాడు రైల్వే గేట్ వద్ద ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాకర్ల వీధికి చెందిన సుబ్బారావు చిన్నఎరుకపాడు నుంచి తన స్వగృహానికి వెళ్తుండగా, వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

October 5, 2025 / 03:48 PM IST

గిడిగి జలపాతంలో వ్యక్తి గల్లంతు

CTR: చిత్తూరు జిల్లా వీకోట మండలం గిడిగి జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి, శ్రీనివాసులు(40) గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 5, 2025 / 03:45 PM IST

స్వామివార్లను దర్శించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

ATP: తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం అశ్వర్ధ నారాయణస్వామిని, చక్ర భీమ లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

October 5, 2025 / 03:45 PM IST

‘కల్తీ మద్యం తయారీలో ఇంఛార్జ్ ప్రమేయం లేదు’

అన్నమయ్య: మొలకలచెరువు కల్తీ మద్యం తయారీలో అక్కడి ఇంఛార్జ్ ప్రమేయం లేదని టీడపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ తెలిపారు. ఇవాళ మదనపల్లె నందు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ…ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. అనంతరం వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

October 5, 2025 / 03:45 PM IST