KDP: సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి గ్రామ పంచాయతీ సంటిగారి పల్లి గ్రామం సూచిక బోర్డు ముళ్ళ పొదల్లో ఉండడంపై, బోర్డు కనపడటం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు. కొత్త వారు ఎవరైనా రావాలి అంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, ముళ్ల పొదలను తొలగించి, సూచిక బోర్డు కనపడే విధంగా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.