ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎద్మావతి తులసి తెలిపారు. మార్చి 31వ తేదీ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
ELR: జిలుగుమిల్లీ మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా.గోపి మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని వారికి తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో మంజూరైన రూ. 42 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రజావేదిక కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారు.
E.G: కోరుకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆలయ అధికారులు శనివారం కలిసి ఉత్సవాలకు సంబంధించి మొదటి శుభలేఖను అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
PLD: జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడిగా మాచవరం మండలం రేగులగడ్డకు చెందిన జక్కుల కృష్ణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని యాదవుల హక్కుల కోసం పోరాడుతూ, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
TPT: జిల్లా రేణిగుంట శ్రీరాజరాజేశ్వరీ దేవి జ్ఞానపీఠంలో మహా శివలింగ ప్రతిష్ఠాపన శుక్రవారం ఘనంగా జరిగింది. 32 దేశాల నుంచి 140 మంది విదేశీ భక్తులు హాజరయ్యారు. శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం, మహా చండీ హోమం నిర్వహించారు. జర్మనీ గురూజీ పరమహంస విశ్వనంద స్వామీజీ చేతుల మీదగా పూజా కార్యక్రమాలు జరిగాయి. విదేశీ భక్తులు సైతం శివ నామ స్మరణలతో మైమరిచిపోయారు.
SKLM: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరుకట్ల విఠల్ రావు పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రి పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ప్రకాశం: దొంగతనాలే వృత్తిగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగకు 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం గిద్దలూరు కోర్టు తీర్పించింది. కంభంకు చెందిన రసూల్ అనే పాత నేరస్తుడు కంభం మండలం నర్సిరెడ్డిపాలెం పోలేరమ్మ గుడిలో ఉండి పగలగొట్టి నగదు దోచుకున్నాడు. అలానే కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ ఎలక్ట్రికల్ షాపులో రసూల్ చోరీకి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.
W.G. వీల్ చైర్ క్రికెట్లో పాలకొల్లు కుర్రాడు మురపాక నళిని రాజశేఖర్ సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు రాజశేఖర్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ఏసీఏ శుక్రవారం ప్రకటించింది.
NTR: వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో టీడీపీ నేత మాదిగాని గురునాథం నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఆరోపణలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయని అన్నారు. స్వార్థ రాజకీయ లాభాల కోసం, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హెరిటేజ్ పై బురద జల్లుతున్నారని విమర్శించారు.
NDL: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో 13 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ. 5,61,81,535 నగదు ఆదాయం లభించింది. దీంతో పాటు 124 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా అందాయి. పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియను దేవస్థానం అధికారులు నిర్వహించారు.
GNTR: కొల్లిపర మండలం పాత బొమ్మువారి పాలెం టీడీపీ సర్పంచ్ కొల్లి శివరామిరెడ్డి (51) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరు GGHకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. శివరామిరెడ్డి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
TPT: తిరుపతి కొర్లగుంట మారుతీనగర్లో విషాదం నెలకొంది. నగరి మండలం గుండ్రాజుకుప్పానికి చెందిన దివ్య (20) మూడేళ్ల కిందట ప్రకాశ్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 18 నెలల సితార అనే కుమార్తె ఉంది. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని భర్త దివ్యను మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కడప: నగరంలోని చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ‘శక్తి’ టీమ్ ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ వినియోగం, ఎస్.ఓ.ఎస్ బటన్ ప్రాముఖ్యత, డయల్ 112 సేవలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ నంబర్లను గుర్తు చేశారు.