SKLM: ఎన్డీఎ కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపు లభించిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి వార్షిక ఉత్సవాల గోడ పత్రికను కోటబొమ్మాళిలో ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.