• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

ఎన్టీఆర్: భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ బ్లాక్ నంబర్ 13లో నివసిస్తున్న పార్వతి అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబానికి టీడీపీ నేత రామయ్య అండగా నిలిచారు. పార్వతి కుటుంబ సభ్యులకు కాలనీలోని ఓనర్స్&రెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలసి ఆయన ఆదివారం రూ.35వేల ఆర్థికసాయం అందజేశారు.

September 22, 2024 / 12:43 PM IST

మాజీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

GNTR: తాడేపల్లిలోని YS జగన్ ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం హయాంలో కల్తీ నెయ్యి వినియోగంపై BJYM నాయకులు జగన్ నివాసం వద్దకు ఒక్కసారిగా చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలు, భక్తులకు జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు BJYM నాయకులు పంపించే ప్రయత్నం చేశారు.

September 22, 2024 / 12:42 PM IST

వ్యవసాయ మార్కెట్లో నేటి మిర్చి ధరల వివరాలు

PLD: దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం రూ.18వేల నుంచి రూ.18,800, అరుమూరు రకం రూ.14వేల నుంచి రూ.14,800, 334 రకం రూ.16,500నుంచి రూ.17వేలు, బ్యాడి 2043 రకం రూ.17నుంచి రూ.17,500, 5531 బ్యాడి రకం రూ.14,500నుంచి రూ.15వేల, 26 రకం రూ.17నుంచి రూ.17,800, షార్క్ రకం రూ.17నుంచి రూ.17,800గా ఉన్నాయి.

September 22, 2024 / 12:42 PM IST

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

KDP: హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

September 22, 2024 / 12:42 PM IST

VIDEO: రఘురామ కృష్ణంరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కృష్ణా: నూజివీడు శ్రీనివాస మహల్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల యోధుల సంక్షేమ సంఘం ఆదివారం పాలాభిషేకం చేసింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన రఘురామ కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

September 22, 2024 / 12:41 PM IST

టీడీపీ సీనియర్ నాయకులు మృతి

TPT: తిరుపతి జిల్లా కేవీబీ. పురం మండలంలోని కోవనూరు గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు డి రామయ్య మృతిచెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షులు రామాంజులు నాయుడు ఆదివారం ఆయన భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

September 22, 2024 / 12:41 PM IST

పేటలో సంచార జాతుల దుకాణాలకు నిప్పు

TPT: నాయుడుపేట పట్టణంలో సంచార జాతుల షాపులను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. వీటిని తగలబెట్టింది ఓ పలుకుబడి కలిగిన వ్యక్తే అని వారు అనుమానిస్తున్నారు. ఇవి తగల పడటంతో సంచార జాతుల వారు వీధిన పడ్డారు. ఇలా తమ గుడిసెలను తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని…? వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

September 22, 2024 / 12:41 PM IST

VIDEO: టంగుటూరులో జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా.. ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా, మెడికల్ క్యాంపును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

September 22, 2024 / 12:41 PM IST

టైలర్ వృత్తి గణనీయంగా తగ్గిపోయింది

GNTR: మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు రావడంతో టైలర్ వృత్తి గణనీయంగా తగ్గిపోయిందని సీనియర్ టైలర్ భావనారాయణ అన్నారు. మంగళగిరి ఆటోనగర్ రుచి హోటల్ ఆవరణలో ఆదివారం అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షునిగా షేక్ నాగుల్ మీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

September 22, 2024 / 12:39 PM IST

సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్‌కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీరం వద్ద మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

September 22, 2024 / 12:35 PM IST

పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్‌కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీరం వద్ద మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

September 22, 2024 / 12:35 PM IST

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

GNTR: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు.

September 22, 2024 / 12:35 PM IST

అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన సినీ నిర్మాత

ఏలూరు: బుట్టాయగూడెంలో కరాటం రంగనాయకమ్మ కాలనీలో వినాయక చవితి అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవుళ్ళు సినిమా నిర్మాత కరాటం రాంబాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు ఆయన అన్నప్రసాదాలు వడ్డించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

September 22, 2024 / 12:32 PM IST

VIDEO: ముగిసిన గణపతి నవరాత్రులు… భారీగా అన్న సమారాధన

కోనసీమ: రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటల నుండి భారీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30 రకాలతో భక్తులకు భోజనాలను అందజేశారు. గ్రామంలోని భక్తులందరూ… ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

September 22, 2024 / 12:30 PM IST

నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసిన పూర్వవిద్యార్థులు

E.G: రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న 2004-2005 బ్యాచ్ పూర్వవిద్యార్థులు సుమారు రూ. 50వేలతో నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. నీళ్ల ట్యాంక్, కుళాయిలు ఏర్పాటు చేసి, ఆదివారం వాటిని ప్రారంభించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను అభినందించారు.

September 22, 2024 / 12:29 PM IST