ప్రకాశం: టిఫిన్లో సాంబార్ నాణ్యత బాగాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం తీగలగొందిలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నాణ్యత పరిశీలించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఛైర్మన్ హెచ్చరించారు.
SKLM: ప్రతి పల్లె పల్లెలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు మందస వెలుగు పీవో పీ. కూర్మా రావు తెలిపారు. మంగళవారం మందస మండల పరిధిలో పలు గ్రామాల్లో స్వయం శక్తి సంఘాల మహిళల సభ్యులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. వస్తు సేవలపై పన్నులు ధరలు తగ్గి పేద, మధ్య తరగతి వర్గాలు కు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు.
VSP: ఎయిర్ పోర్ట్ పర్యావరణ కమిటీ సమావేశం విశాఖ కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నిర్వహించారు. డ్రెయిన్ల ద్వారా మురుగు, వర్షపు నీరు సాఫీగా పోయేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో నిర్మాణ సామగ్రి, చెత్తా చెదారం డంపింగ్ చేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు.
PPM: మన్యం జిల్లా కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత నీటి ఘటనపై వైసీపీ నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎంపీ డా. తనూజా రాణి, EXDCM పుష్పశ్రీవాణి తదితరులు ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్యను కలిసి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఛైర్మన్ స్పందించి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు.
SKLM: ఆది కర్మ యోగి అభియాన్ ఫేజ్ -1 పథకం అమలులో భాగంగా బూర్జ, సరుబుజ్జిలి, ట్రైబల్ శాఖ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ మంగళవారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, విద్యా, వైద్యం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.
కృష్ణా: పెనమలూరు మండలంలోని వణుకూరు,పెనమలూరు గ్రామాల్లో గృహ నిర్మాణ లేఅవుట్లను జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం సందర్శించారు. లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణ స్థలాల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ప్రతి లేఅవుట్లో రహదారులు, డ్రైనేజ్, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
W.G: పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో భాగంగా ఇవాళ వల్లూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్మశాన వాటికలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి ప్రధానమైన సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మంగళవారం తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా చట్టం & శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా భద్రతా చర్యలు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చించారు. పోలీస్ విభాగం చేపడుతున్న ప్రజా సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ మేరకు ప్రజల భద్రత కోసం మరింత సమర్థవంతమైన చర్యలు కొనసాగించాలని సూచించారు.
ASR: రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అరకు సీఐ ఎల్.హిమగిరి వాహనదారులకు సూచించారు. మంగళవారం రాత్రి డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం వద్ద ఎస్సై కే.పాపినాయుడుతో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పలువురికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారి నిబంధనలు పాటించాలని తెలిపారు.
CTR: పులిచెర్ల(M) పాలెంపంచాయితీలో మంగళవారం వేకువ జామున పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేయడంతో కొబ్బరి, మామిడి చెట్లకు నష్టం వాటిల్లింది. పంచాయతీ పరిధిలోని కొంగర వారిపల్లి వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు మునిరత్నం నాయుడు, సురేందర్ నాయుడుకు చెందిన కొబ్బరి, మామిడి చెట్లను ధ్వంసం చేసింది. అనంతరం ఏనుగు తిరిగి వచ్చిన దారిలోనే అడవులకు చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు.
కృష్ణా: గుడివాడ 31వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మంగళవారం పర్యటించారు. ఏజీకే స్కూల్ ఎదురుగా ఓపెన్గా ఉన్న మ్యాన్ హోల్ను మూసి వేయించారు. అనంతరం రోడ్డు విస్తరణకు ప్రపోజల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ రోడ్డును సందర్శించి, బ్లాక్ అయిన డ్రైన్స్, కల్వర్టులను క్లీన్ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
TPT: శ్రీవారి ఆలయంలో 30న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ముందురోజు 29న రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మేరకు పుష్పయాగం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది.
VSP: యువతరం నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలని వో.ఎన్.జీ.సీ. సీజీఎం (హెచ్ఆర్) రేపల్లె శ్రీరామారావు అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులనుద్దేశించి మంగళవారం ఆయన నాయకత్వం అంశంపై ప్రసంగించారు. నాయకుడిగా రాణించాలని అనుకునే వ్యక్తులు ముందుగా స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు.
E.G: ఆర్య వైశ్య సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సేవా తత్వవేత్త ప్రగలపాటి కనకరాజుకి విశిష్ట గౌరవం లభించింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనను “జీవిత సాఫల్య పురస్కారం”కి ఎంపిక చేసినట్లు సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు వి.ఎన్. డైమండ్ ఎరుకుల్ల రామకృష్ణ మంగళవారం ప్రకటించారు.
CTR: జిల్లాలో మామిడి రైతుల ఖాతాలోకి రాయితీ ధర మొత్తాన్ని జమ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 34 మండలాల పరిధిలోని 32,000 మంది రైతుల ఖాతాలోకి రూ. 147 కోట్ల నగదును జమ చేసినట్టు ఆయన తెలియజేశారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేర కేజీకి రూ.4 చొప్పున చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.