CTR: బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కేంద్రంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వీకోటలో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు డెంగీ బారిన పడి మృతి చెందారని చెప్పారు. బైరెడ్డిపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా శాఖ అధికారులు, కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు.