NLR: జలదంకి మండలం, బ్రాహ్మణక్రాకలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతన్నలతో మాట్లాడుతూ.. ‘రైతు ప్రభుత్వం’ అనగానే గుర్తొచ్చే పేరు టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతు రాబడి పెంచే దిశగా, గౌరవం కాపాడే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.