సత్యసాయి: మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఇవాళ మంత్రితో భేటీ అయ్యారు. జిల్లాలోని అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై వారు చర్చించినట్లు తెలిపారు.