NDL: మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ సమీపమున ఓ బొలెరో వాహనం వెదురు అక్రమ రవాణా చేస్తూ ఉండగా, గమనించిన అటవీ శాఖ అధికారులు బొలెరో వాహనం స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వెదురును, బొలెరో వాహనంను డిపోకు తరలించినట్లుగా సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కర్లపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ పేర్కొన్నారు. కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో ఆదివారం స్వచ్ఛత హీ సేవా భారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం: దివంగత మాజీమంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద ఆంజనేయులు విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ.. మంత్రిగా దామచర్ల ఆంజనేయులు ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.
WG: కాళ్ల మండలం ఏలూరుపాడులో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదివారం మరోసారి స్పందించారు. “నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టమంటున్న వారికి అసలు వాటి గురించి తెలుసా అని ప్రశ్నించారు. నేనేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదని, మీ దేవుడిని పూజించుకునేందుకు మీకు ఎంత హక్కు ఉందో మా దేవుడుని పూజించేందుకు తమకు అంతే హక్కు ఉందన్నారు.
NLR: కొండాపురం మండలంలో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటిస్తారని టీడీపీ మండల కన్వీనర్ మామిళ్ళపల్ల ఓంకార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఆయన గ్రామానికి చేరుకుని ఓలేటి పాలెం- కొండాపురం డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారన్నారని పేర్కొన్నారు.
KDP: శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. కడపలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
WG: గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం నుంచి విజయవాడ వరద బాధితుల కోసం జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించారు. ఈ సందర్భంగా సేకరించిన 700 కేజీల బియ్యాన్ని ఆదివారం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు దేవరపల్లి కార్యాలయంలో సువర్ణ రాజుకి అందజేశారు.
NLR: సూళ్లూరుపేలోని శ్రీహరికోటకి వెళ్లే మార్గంలో ఉన్న ఉల్సాపడవ రోడ్డు చెత్త చెదారాలతో నిండిపోయి డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు వ్యర్ధాలను తీసుకొచ్చి రోడ్డుకు ఇరువైపులా వేయడంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కంపుగా మారిందని అటువైపు వెళ్లే గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
ప్రకాశం: బేస్తవారిపేటలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలియజేశారు. రైతులకు మేలు చేసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే మా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
ప్రకాశం: బేస్తవారిపేటలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలియజేశారు. రైతులకు మేలు చేసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే మా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
VZM: విజయవాడ వరద బాధితుల సహాయార్థం అవనాపు విజయ్, అవనాపు భార్గవి రూ.50,000 చెక్కును విరాళంగా ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుకి ఆదివారం అశోక్ బంగ్లాలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
NLR: నాయుడుపేటలో బస్టాండ్ ప్రాంతం వద్ద ఉన్న నకల జాతుల దుకాణాలు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అగ్ని ప్రమాదంలో రెండు షాపులు పూర్తి కాలిపోయాయి. గతంలో వ్యాపారం చేసుకుంటున్న స్థలాన్ని కోర్టు ఉత్తర్వులతో నకలజాతుల వారిని తొలగించారు. అప్పటి నుంచి డివైడర్ పై షాపులు పెట్టుకుని, అక్కడే జీవనం సాగిస్తున్నారు. అగంతుకులు నిప్పుపెట్టడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గోపవరంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను మాల మహానాడు కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించిన ఎమ్మెల్యే కృష్ణంరాజుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాల మహానాడు నేతలు పాల్గొన్నారు.
KDP: మన చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పేర్కొన్నారు. స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కడపలో ఆదివారం ఉదయం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
CTR: చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలియంబాకం,పెట్ట కండ్రిక గ్రామాల్లో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన హరినాధ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం కండ్రిగలో పర్యటించి, అనారోగ్యానికి గురైన కార్యకర్తను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.